పవన్కళ్యాణ్ అజ్ఞాని, వైఎస్ఆర్ వల్ల రాష్ట్రం సమైక్యంగా ఉందన్న విషయం ఆయనకు తెలియదన్నారు. విభజన గొడ్డలికి వైఎస్ఆర్ ఎదురొడ్డి నిలిచారని చెప్పారు. పవన్కళ్యాణ్ లాంటి మూర్ఖులకు ఇది తెలియకపోవచ్చునన్నారు. వైఎస్ఆర్ మరణవార్త విని 600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని, ప్రజల గుండెలు ఎంతగా క్షోభించాయో చూడగలిగేటువంటి మనసు, కళ్లు పవన్ కళ్యాణ్కు లేవన్నారు. ఐదేళ్లు గడిచినా వైఎస్ ను ప్రజల గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ఈ రాష్ట్రం విడిపోయేవరకూ నిద్రపోని పార్టీ బిజెపి అన్నారు. అలాంటి పార్టీని చెవిలో పువ్వుమాదిరిగా పవన్ పెట్టుకున్నారని విమర్శించారు. విభజనకు వ్యతిరేకంగా రాజ్యసభలో మాట్లాడలేని శక్తిహీనుడు మీ అన్న, అలాంటి అన్నను ప్రశ్నించావా? అని అడిగారు. ఇంతమంది విభజన వాదుల మధ్య నిలబడి సమైక్యత కోసం పోరాడిన జగన్పైన ఆరోపణలు చేస్తున్నావని పవన్ పై మండిపడ్డారు.
రాష్ట్ర ప్రజల లెక్కల్లోలేని మనిషి పవన్ కళ్యాణ్ అన్నారు. లెక్కల్లో లేని మనిషిని జగన్ పట్టించుకోరని చెప్పారు. మీరెన్నిచేసినా జగన్ను ఒక్క అంగుళం కూడా కదపలేరన్నారు. పవన్, చిరంజీవి, చంద్రబాబు.... ఇలా ఎంతమంది తిట్టినా జగన్ను ఏం చేయలేరని చెప్పారు. జగన్పై ప్రజలకున్న అభిమానాన్ని తగ్గించలేరని కూడా పద్మ స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment