ఢిల్లీ బయల్దేరిన వైఎస్ఆర్ సీపీ బృందం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఢిల్లీ బయల్దేరిన వైఎస్ఆర్ సీపీ బృందం

ఢిల్లీ బయల్దేరిన వైఎస్ఆర్ సీపీ బృందం

Written By news on Monday, May 19, 2014 | 5/19/2014

ఢిల్లీ బయల్దేరిన వైఎస్ఆర్ సీపీ బృందం
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. సోమవారం మధ్యాహ్నం ఆయన తమ పార్టీ ఎంపీలతో కలిసి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలవనున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా గత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో ఆయన నుంచి స్పష్టత కోరనున్నారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు.

పోలవరం ప్రాజెక్టును జాతీయప్రాజెక్టుగా ప్రకటించి, దాని నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని విభజన సందర్భంగా యూపీఏ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులు పదే పదే చెప్పిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తినడం, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రావడంతో ఆ హామీలు ఎంతవరకు నెరవేరతాయన్న విషయాన్ని నిర్ధారించుకోడానికి, స్పష్టమైన హామీలు పొందడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం ఢిల్లీ వెళ్లింది.
Share this article :

0 comments: