విశాఖపట్నం: అనకాపల్లి, నర్సీపట్నంలో వైఎస్ విజయమ్మ పర్యటనలను రద్దు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం అనకాపల్లి, నర్సీపట్నంలో విజయమ్మ పర్యటించాల్సి ఉంది. అయితే భారీ వర్షం కారణంగా విజయమ్మ పర్యటనను రద్దు చేశారు.
క్యుములోనింబస్ మేఘాల కారణంగా విశాఖపట్నం, విజయనగరం, కోస్తాంధ్రలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఓ సభలో వర్షంలోనే తడుస్తూ విజయమ్మ ప్రసంగించిన సంగతి తెలిసిందే. అనకాపల్లి, నర్సీపట్నంలో విజయమ్మ పర్యటించే షెడ్యూల్ ను త్వరలోనే పార్టీ ప్రచార కమిటీ విడుదల చేస్తారు.
0 comments:
Post a Comment