వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఈనాడు రాస్తున్న తప్పుడు కథనాలపై ఎన్నికల కమిషన్ కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల డిప్యూటీ సీఈవో దేవసేనను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల నేపథ్యంలో ఈనాడు అసత్య కథనాలు రాస్తుందని ఫిర్యాదు చేశారు. ఈనాడు పత్రికలో ప్రచురించిన కథనాలను వైఎస్ఆర్సీపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకువచ్చారు.
వైఎస్ఆర్ కుటుంబంపై బురద జల్లుతూ టీడీపీకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం ఈనాడు చేస్తుందని ఫిర్యాదులో వైఎస్ఆర్సీపీ పేర్కోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలిసిన వారిలో వైఎస్ఆర్సీపీ నేతలు వాసిరెడ్డి పద్మ, శివకుమార్ లు ఉన్నారు.
0 comments:
Post a Comment