విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విజయమ్మకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చేసింది వైఎస్ఆర్ అని చెప్పారు. అటువంటి వైఎస్ఆర్ పాలన కోసం ఆలోచన చేయాలని విజయమ్మ ప్రజలను కోరారు. ఎన్టీఆర్ పథకాలనే చంద్రబాబు అమలు చేయలేకపోయారని, ఆ పాలన ఒక పీడకలని, వ్యవసాయం దండగన్న చంద్రబాబు పాలను ఏ రైతూ మర్చిపోడని విజయమ్మ పేర్కొన్నారు. లాభాల్లో ఉన్న కంపెనీలను చంద్రబాబు తన అనుచరులకే ధారాదత్తం చేశాడని విమర్శించారు. మీ హయాంలో ఎంతమందికి ఉద్యోగాలు తీసేసారో, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కుప్పంను అభివృద్ధి చేయని చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్గా ఎలాచేస్తారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మొద్దని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని విజయమ్మ ప్రజలను కోరారు.
Home »
» ఆ పాలన ఒక పీడకల
ఆ పాలన ఒక పీడకల
Written By news on Friday, May 2, 2014 | 5/02/2014
విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విజయమ్మకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చేసింది వైఎస్ఆర్ అని చెప్పారు. అటువంటి వైఎస్ఆర్ పాలన కోసం ఆలోచన చేయాలని విజయమ్మ ప్రజలను కోరారు. ఎన్టీఆర్ పథకాలనే చంద్రబాబు అమలు చేయలేకపోయారని, ఆ పాలన ఒక పీడకలని, వ్యవసాయం దండగన్న చంద్రబాబు పాలను ఏ రైతూ మర్చిపోడని విజయమ్మ పేర్కొన్నారు. లాభాల్లో ఉన్న కంపెనీలను చంద్రబాబు తన అనుచరులకే ధారాదత్తం చేశాడని విమర్శించారు. మీ హయాంలో ఎంతమందికి ఉద్యోగాలు తీసేసారో, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కుప్పంను అభివృద్ధి చేయని చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్గా ఎలాచేస్తారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మొద్దని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని విజయమ్మ ప్రజలను కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment