కర్నూలు: నా రాజకీయ జీవితమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనేనని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదని భూమా స్పష్టం చేశారు.
వైఎస్ఆర్ సీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను భూమా నాగిరెడ్డి ఖండించారు. పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని భూమా తెలిపారు. నా నియోజకవర్గ ప్రజల తీర్పును గౌరవిస్తానని భూమా నాగిరెడ్డి అన్నారు.
0 comments:
Post a Comment