సాధారణంగా వోటింగ్ ప్రారంభం కాగానే ఏ పార్టీపై వైపు ‘గాలి’ వీస్తుందో తెలిసిపోతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అదే చేస్తున్నట్టుగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమపై దాడులకు దిగుతోందని, అక్రమాలు చేస్తోందని ఆరోపణలు చేయడం, మరోవైపు ఎన్నికల ప్రధాన అధికారి సంపత్ ను కలిసి ఫిర్యాదు కూడా చేయడం, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ భన్వర్ లాల్ పై చిందులు వేయడం, ఇక టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏకంగా ప్రజలకు బహిరంగ లేఖనే రాయడం చూస్తుంటే ఓడిపోతామని పక్కా సమాచారం వారికి వచ్చి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టీడీపీ నాయకుల పరిస్తితి అలా ఉంటే, బీజేపీ నాయకులు కూడా చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం చారిత్రాత్మక తప్పిదమేనని అంగీకరిస్తున్నారని ఒక ప్రముఖ జాతీయ దినపత్రిక సంచలన కధనం ప్రసారం చేసింది. ఆ పత్రికతో బీజేపీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీమాంధ్రలో చాలా బలంగా ఉన్నాడని, అయన పార్టీ అధికారంలో రావడం ఖాయంగా కనిపిస్తోందని అంగీకరించారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు, జగన్ ను ఎదుర్కోలేకపోయాడని కూడా ఆ నేత చెప్పడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
http://telugu.hydfirst.com/bjp-leader-confesses-ys-jagan-is-strong-in-seemandhra/
0 comments:
Post a Comment