రుణమాఫీపై టీడీపీ మీనమేషాలు లెక్కించటం తగదని ఉమ్మారెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే తొలి సంతకం రుణమాఫీ ఫైల్ పై చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా రుణమాఫీ అమలు చేయాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. బాబు తన నిజాయితీ నిరూపించుకోవాలంటే రుణమాఫీ చేయాలని ఆయన అన్నారు.
కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించనుంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ 70 మంది ఎమ్మెల్యేలు, తొమ్మిదిమంది లోక్సభ సభ్యులను గెలుచుకోవడమే కాకుండా 45 శాతం మేరకు ఓట్లు సాధించడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో చేర్చనుంది.
0 comments:
Post a Comment