ప్రకాశం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్కు తొలి సీఎంగా కాబోతున్నారని వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్ధి వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
సమైక్య రాష్ట్రం కోసం నిజాయితీగా పోరాటం చేసిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. వైఎస్ జగన్ జైలులో ఉండి కూడా వారం రోజుల పాటు సమైక్యరాష్ట్రం కోసం దీక్ష చేశారన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు వైఎస్ జగన్ సీఎం అయితే యువత, మహిళలకు పెద్దపీట వేస్తారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అంతేకాకుండా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సంక్షేమ పథకాల అమలు వైఎస్ జగన్ తోనే సాధ్యమన్నారు.
0 comments:
Post a Comment