టీడీపీ దాడి.. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల పరిస్థితి విషమం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ దాడి.. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల పరిస్థితి విషమం

టీడీపీ దాడి.. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల పరిస్థితి విషమం

Written By news on Saturday, May 24, 2014 | 5/24/2014

అధికారంలోకి వచ్చామన్న అహంకారంతో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. దాంతో ఇద్దరు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల పరిస్థితి విషమంగా మారింది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఇటీవలి కాలంలో టీడీపీ వర్గాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ డాడులు చేస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి, అనంతపురం లాంటి ప్రాంతాల్లో కూడా టీడీపీ శ్రేణులు విధ్వంసానికి పాల్పడ్డాయి. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఏకంగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపైనే దాడులు చేశారు.
Share this article :

0 comments: