వైఎస్ఆర్ కాంగ్రెస్ - యూఎస్ ఎన్ఆర్ఐ కమిటీ ఆధ్వర్యంలో వైఎస్ షర్మిల లైవ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. మే 16న ఎన్నికల లెక్కింపు జరగనున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందంటూ వైఎస్ షర్మిల 150కి పైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
జగనన్న వదిలిన బాణం అంటూ వైఎస్ షర్మిల...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సుదీర్ఘ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఆమె 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర పేరిట 3112 కిలోమీటర్ల దూరాన్ని 230 రోజుల పాటు చేపట్టి చరిత్ర పుటల్లోక్కి ఎక్కారు. 2012 అక్టోబర్ 18న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. రాష్ట్రంలో 14 జిల్లాలు, 116 అసెంబ్లీ నియోజక వర్గాలు, తొమ్మిది కార్పొరేషన్లు, 45 మున్సిపాల్టీలు, 195 మండలాల్లో షర్మిల పర్యటించారు.
0 comments:
Post a Comment