అనంతరం గుజరాత్ భవన్ వద్ద జగన్ విలేకరులతో మాట్లాడారు. విభజన సమయంలో సీమాంధ్రకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. సీమాంధ్ర, తెలంగాణలలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలని మోడీని కోరినట్లు తెలిపారు. ఎన్ డిఏ ప్రభుత్వానికి తమ మద్దతు అవసరం లేకపోయినా, అంశాల ప్రాతిపదికన మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని విలేకరుల ప్రశ్నకు జగన్ సమాదానం చెప్పారు.
సీమాంధ్రకు సహాయసహకారాలు అందిస్తామని మోడీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. తమ విజ్ఞప్తిపై మోడీ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావిస్తున్నామని జగన్ అన్నారు.
వినతి పత్రంలోని ముఖ్యమైన అంశాలు:
1. కేజీబేసిన్లో రాష్ట్రానికి వాటా ఇవ్వాలి
2.తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
3.చిత్తూరు జిల్లా మన్నవరం ప్రాజెక్టును పూర్తిచేయాలి
4.తెలంగాణలో ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలి
5. రాష్ట్రవిభజన చట్టంలో సీమాంధ్రకు ఇచ్చిన రాయితీలన్నీ అమలు చేయాలి
6. సీమాంధ్రకు 15సంవత్సరాలపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలి
7. వైఎస్ఆర్ జిల్లాలో సెయిల్ స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేయాలి
8. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి క్రూడాయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలి
9. పెట్రో కెమికల్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయాలి
10.వైజాగ్, చెన్నై మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలి
0 comments:
Post a Comment