ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదన్న పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికారు. ఒకప్పుడు తాను విమర్శించిన చంద్రబాబునే గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. పనిలోపనిగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైన విషం కక్కుతున్నారు. సినీ నటుడు రాజా ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఏం పోరాటం చేశారంటూ పవన్ ను నిలదీశారు. రాజా ఏం అన్నారంటే..
పవన్ కల్యాణ్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని శనివారం సినీ హీరో రాజా ఆరోపించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టుల మీద ఆధారపడి మాట్లాడటం కాదని....చేతనైతే ప్రజల మధ్య తిరిగి వారి సమస్యలను తెలుసుకుని మాట్లాడాలని పవన్ కల్యాణ్ కు సూచించారు. సినిమా ఇండస్ట్రీలో అన్యాయం గురించి ఎప్పుడైనా స్పందించారా అంటూ సూటిగా ప్రశ్నించారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ను ఎదిరించిన ఒకే ఒక్క సింహం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆయన అభివర్ణించారు. టీడీపీ, బీజేపీలకు జగన్ ఫోబియా పట్టుకుందని అన్నారు. అంతే పవన్ ఫ్యాన్స్ ఆవేశంతో రెచ్చిపోయి ఇలా తప్పుడు ప్రచారానికి దిగారు.
0 comments:
Post a Comment