మోడీ మద్దతు ఆంధ్రప్రదేశ్ కు అవసరం: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మోడీ మద్దతు ఆంధ్రప్రదేశ్ కు అవసరం: వైఎస్ జగన్

మోడీ మద్దతు ఆంధ్రప్రదేశ్ కు అవసరం: వైఎస్ జగన్

Written By news on Monday, May 19, 2014 | 5/19/2014

మోడీ మద్దతు ఆంధ్రప్రదేశ్ కు అవసరం: వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
న్యూఢిల్లీ : త్వరలో దేశ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టనున్ననరేంద్ర మోడీ మద్దతు ఆంధ్రప్రదేశ్ కు చాలా అవసరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన లోక్‌సభ సభ్యుల ప్రతినిధి బృందం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో సోమవారం ఢిల్లీ చేరుకుంది. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలో మోడీని కలిసి, తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయనుంది. దాంతోపాటు, రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లోని అస్పష్టతను తొలగించాలని ఆయనకు విజ్ఞప్తి చేయనుంది.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ భావితరాలకు భవిష్యత్ లేనివిధంగా అత్యంత దారుణంగా రాష్ట్ర విభజన జరిగిందన్నారు. విభజనకు సంబంధించి చాలా విషయాల్లో స్పష్టత ఇవ్వాలని మోడీని కోరనున్నట్లు ఆయన తెలిపారు. మోడీ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రానికి అసవరమైన అంశాలను అందులో పెట్టాల్సి ఉందన్నారు. తాము గతంలో కూడా ఎన్డీయే ప్రభుత్వానికి  వ్యతిరేకం కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం అంశాల వారీగా మద్దతు ఇస్తామన్నారు. అయితే సొంతంగా 283 స్థానాలు సాధించిన మోడీకి తమ మద్దతు అవసరం లేదని... కానీ  కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ప్రధానమంత్రి మద్దతు అవసరమని వైఎస్ జగన్ చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని వైఎస్ జగన్ అన్నారు. మన్మోహన్ సింగ్ లోక్ సభలో చెప్పిన అంశాలపై ఎలాంటి స్పష్టత లేదన్నారు. వాటిని కనీసం బిల్లులో కూడా చేర్చలేదని జగన్ అన్నారు. రాజధాని నిర్మాణానికి నిధుల విషయంలో స్పష్టత లేదన్నారు. ఇక వైఎస్ జగన్ తో పాటు కొత్తగా ఎన్నికైన తొమ్మిది మంది ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎస్పీవై రెడ్డి, అవినాష్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బుట్టా రేణుక, కొత్తపల్లి గీత, వరప్రసాద్, మిధున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.
Share this article :

0 comments: