రాష్ట్ర నిర్మాణంలో సమష్టి పోరాటం...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శనివారమిక్కడ తెలంగాణ శాసనసభాపక్షం సమావేశమైంది. ఈ సమావేశంలో వైఎస్సార్సీఎల్పీ నేతకు సంబంధించి ఏకగ్రీవంగా తీర్మానం చేసి పార్టీ అధినేత జగన్కు అప్పగించారు. సమావేశం అనంతరం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, బానోతు మదన్లాల్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలతో పాటు రాష్ట్ర నిర్మాణంలో సమిష్టిగా అసెంబ్లీ లోపల, బయట తమ వంతు పాత్ర పోషిస్తామని పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పార్టీ స్థాపించినప్పట్నుంచీ తమ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారని, అదే స్ఫూర్తితో తెలంగాణలో తాము కూడా పోరాడుతామన్నారు. తెలంగాణలో వైఎస్సార్సీపీ తరఫున ప్రజావాణి వినిపిస్తూ, పార్టీని నిర్మాణపరంగా మరింత బలోపేతం చేస్తామన్నారు.
పోలవరం ముంపు బాధితులను ఆదుకోవాలి
పోలవరం ప్రాజెక్టు వల్ల ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూడాలనేది తమ ప్రధాన డిమాండ్ అని పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్నవారికి భూమికి భూమి, మెరుగైన ప్యాకేజీ అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు తమ వంతు కృషి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్డినెన్స్లో కొన్ని లోపాలున్నాయని, వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. తెలంగాణ గ్రామాలను సీమాంధ్రలో కలపడాన్ని ఒప్పుకునేది లేదన్నారు.
0 comments:
Post a Comment