‘గవర్నర్ ప్రసంగంపై చెప్పడానికి ఏముంది? ఆయన అన్నీ పాత విషయాలే మళ్లీ చెప్పారు. కొత్తవేమీ లేవు. నేను చెప్పదల్చుకున్నది రెండు రోజుల్లో శాసనసభలోనే చెప్తా...’’ అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ శనివారం ఏపీ శాసనసభ, శాసన మండలిల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంపై.. ఆ తర్వాత అసెంబ్లీ లాబీల్లో జగన్ విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. రైతుల రుణ మాఫీ అంశంపైనా గవర్నర్ ప్రసంగంలో కొత్తగా ఏమీ చెప్పలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. కొన్ని పత్రికలు, టీవీ చానళ్ల యాజమాన్యాలు తనకు వ్యతిరేకంగా వార్తలు రాసినా, వ్యతిరేక కథనాలను ప్రసారం చేసినా వాటిలో పనిచేసే జర్నలిస్టులు, ప్రతినిధులపై తనకెలాంటి వ్యతిరేకత లేదని జగన్ పేర్కొన్నారు.
పనిగట్టుకుని వ్యతిరేకంగా రాసే పత్రికల ప్రతినిధులను కూడా తాము కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నామని, వారిని ఏనాడూ తమ పార్టీ దూరంగా పెట్టలేదని చెప్పారు. సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ చానల్ప్రతినిధులను టీడీపీ తమ కార్యక్రమాలకు రానీయకపోవడాన్ని జగన్ ప్రస్తావిస్తూ తాము అలా ఎపుడూ చేయలేదన్నారు.
పనిగట్టుకుని వ్యతిరేకంగా రాసే పత్రికల ప్రతినిధులను కూడా తాము కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నామని, వారిని ఏనాడూ తమ పార్టీ దూరంగా పెట్టలేదని చెప్పారు. సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ చానల్ప్రతినిధులను టీడీపీ తమ కార్యక్రమాలకు రానీయకపోవడాన్ని జగన్ ప్రస్తావిస్తూ తాము అలా ఎపుడూ చేయలేదన్నారు.
0 comments:
Post a Comment