ఇది ముమ్మాటికీ మానవ తప్పిదమే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది ముమ్మాటికీ మానవ తప్పిదమే

ఇది ముమ్మాటికీ మానవ తప్పిదమే

Written By news on Sunday, June 29, 2014 | 6/29/2014

రూ.కోటి పరిహారం ఇవ్వాలి:  నగరంలో వైఎస్ జగన్‌ డిమాండ్
ఇది ముమ్మాటికీ మానవ తప్పిదమే
పాతిక లక్షల పరిహారం సరిపోదు, విదేశాల్లో ఇస్తున్నట్టు భారీగా ఇవ్వాలి.. ఆయిల్ కంపెనీలకు భయం పుట్టేలా పరిహారం ఉండాలి
పరిహారంగా ఎకరా కొబ్బరి తోటకు రూ. 20 లక్షలు, ప్రతి ఇంటికీ రూ. 30 లక్షలు, క్షతగాత్రులకు నెలకు రూ. 20 వేల పింఛన్ ఇవ్వాలి
బాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి కేజీ బేసిన్‌లో మన వాటా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి
బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉండి పోరాడుతుంది

 
 సాక్షి, కాకినాడ: ‘‘ఇది ముమ్మాటికీ మానవ తప్పిదమే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే విదేశాల్లో మాదిరిగా ఆయిల్ కంపెనీలకు భయం పుట్టుకునేలా పరిహారం ఇప్పించాలి. ఒక్కసారి ఇతర దేశాలకు వెళ్లి చూడండి. అక్కడ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మరోసారి పునరావృతం కాకుండా చూసేందుకు ఆ కంపెనీలకు, యాజమాన్యాలకు భయం కల్పించేందుకు వాళ్లు ఇస్తున్న పరిహారం లెక్క చూడండి. నగరం దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఎంత మాత్రం సరిపోదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే గెయిల్‌కు కాని, ఓఎన్జీసీకి కాని ఒంట్లో భయం పుట్టాలంటే కనీసం కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. మృతుల కుటుంబాలనే కాదు.. కాలిపోయి ఏ మాత్రం పనులు కూడా చేసుకోలేని వారి కుటుంబాలను అన్నివిధాలా ఆదుకోవాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికైనా కళ్లు తెరచి, కేజీ బేసిన్‌లో మనకు రావాల్సిన వాటా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో పైపులైన్ పేలుడు ప్రాంతాన్ని శనివారం పరిశీలించి, బాధితులను పరామర్శించిన జగన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

 
 
ఇది ముమ్మాటికీ మానవ తప్పిదం. ఈ ప్రాంతంలో ఇది తొలిసారి జరిగింది కాదు. ఇక్కడి ప్రజలు దాదాపు సంవత్సరం నుంచి అడపాదడపా కంప్లయింట్ చేస్తూనే ఉన్నారు. గెయిల్ వాళ్లు అప్పటికప్పుడు వచ్చి కాస్త తవ్వి, కాస్త సిమెంట్ వేసి మరమ్మతు అయిపోయిందని వదిలేస్తున్నారు.
 
  గ్యాస్ ఒక మేఘంలా దాదాపు 300 మీటర్ల విస్తీర్ణంలో కమ్ముకుని... ఒకరు వంట చేసుకునేందుకు పొయ్యి వెలిగిస్తే ఊరంతా బాంబులా పేలిందంటే... పరిస్థితి ఎంత భయానకంగా ఉందో చెప్పనవసరం లేదు. గెయిల్, ఓఎన్‌జీసీ.. కంపెనీ ఏదైతేనేం ఇక్కడనుంచి వస్తున్న గ్యాస్ ద్వారా రూ.వేలకోట్లు సంపాదిస్తున్నాయి. కానీ స్థానిక ప్రజలకు, పరిసర ప్రాంతాలకు, పర్యావరణానికి ఏ రకంగా న్యాయం చేస్తున్నామనేది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆలోచన చేయాలి.
 
  గ్యాస్ వల్ల ఏ నష్టం జరిగినా మన రాష్ట్రానికే. ఆఫ్‌షోర్‌లో సముద్రం లోపల డ్రిల్లింగ్ చేస్తే కిలోమీటర్.. రెండున్నర కిలోమీటర్ల మేరకు డ్రిల్లింగ్ చేస్తారు. చేసినప్పుడు దాని సిస్మిక్ యాక్టివిటీ వల్ల నష్టం జరిగేది మన ప్రాంతానికే. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ మెకానిజమ్‌లో పొరపాట్లు జరిగితే ప్రాణాలు కోల్పోయేది.. నష్టం జరిగేది మన ప్రాంతానికే. కానీ ఆ గ్యాస్ వల్ల మనకెలాంటి లాభం లేకపోవడం బాధ కలిగిస్తుంది.
 
  ఆఫ్‌షోర్‌లో డ్రిల్లింగ్ జరిగితే కాస్తో కూస్తో ఏదో శనక్కాయలు వేసినట్టుగా రాయల్టీ ఇస్తారు. ఆన్‌షోర్ డ్రిల్లింగ్ జరిగితే అదీ రాదు. బొగ్గు ఉత్పత్తి చేసే సింగరేణి కాలరీస్‌లో కేంద్రానికి 50 శాతం, రాష్ట్రానికి 50 శాతం వాటా. రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత సింగరేణి కాలరీస్‌లో మనకు రావాల్సిన వాటా పూర్తిగా తీసేశారు. రాష్ట్రంలో గ్యాస్ పుష్కలంగా ఉందనుకుంటే... మన రాష్ర్టం అవసరాలకు మాత్రం ఒక్క రవ్వ కూడా గ్యాస్ ఇవ్వరు. నష్టాలు మనకు, లాభాలు పరాయి రాష్ట్రాలకు.
 
  ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కళ్లుతెరవాలి. కేజీ బేసిన్‌లో కేంద్రం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన వాటా అడిగి తీసుకోవాలి. ఈ మేరకు డబ్బులు మనకు వస్తే గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ మీద మనకు కంట్రోల్ వస్తుంది. మన రాష్ర్ట అవసరాలను మనం తీర్చుకునే అవకాశం వస్తుంది. సరసమైన ధరలకు మనవాళ్లకు మనం గ్యాస్ ఇవ్వవచ్చు. ఈ ప్రాంతంలో ఏమైనా నష్టాలు జరిగితే మన వాటా ప్రకారం వచ్చిన వేలకోట్లలో కొంత ఇక్కడ ప్రజలకు.. ఇక్కడి అవసరాలకు.. ఇక్కడి పర్యావరణ పరిరక్షణకు, ఇక్కడ నష్టం జరగకుండా చూసుకునేందుకు ఖర్చు చేసుకోవచ్చు.
 
  నాకందిన సమాచారం మేరకు 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో ఉన్నారు. వారికి ముష్టి వేసినట్టుగా కేవలం 25 లక్షలు రూపాయలు ఇచ్చి దులుపుకుంటున్నారు. ఇందులో గెయిల్, కేంద్రం 20 లక్షలు, పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రెండు లక్షలు, రాష్ర్ట ప్రభుత్వం 3 లక్షలు ముష్టిలా ఇస్తారట. శరీరం పూర్తిగా కాలిపోయి మున్ముందు ఎలాంటి పనులు చేసుకోలేని వారికి రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారట. ఇంతకన్నా దారుణం ఏముంది? మనిషి ప్రాణం విలువ 25 లక్షలేనా? గెయిల్, ఓఎన్జీసీ, కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు కాస్త మానవతా దృక్పథంలో ఆలోచించాలి. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. తీవ్రంగా గాయపడిన వారికి ప్రతినెలా కనీసం రూ.20 వేలు పింఛన్ వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలి.
 
  ఇక పంట పొలాలను ఒక్కసారి చూడండి. పచ్చని కొబ్బరిచెట్లు నిలువెల్లా మాడిపోయాయి. కాలిపోయిన కొబ్బరి చెట్లు పూర్తిగా తొలగించి కొత్త చెట్లు వేయాలి. వాటిని ఈ స్థాయికి వచ్చే వరకూ కాపాడుకోవాలి. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూసుకునేందుకు ఎకరాకు కనీసం అంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వాళ్లకు కనీసం పదిహేను లక్షలు.. రెండు ఫ్లోర్లున్న వారికి కనీసంగా రూ.30 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే ఇళ్లు లేని వారికి ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా.
 
  ఈ గ్యాస్ కలెక్షన్ పాయింట్లన్నీ ఊళ్లకు దూరంగా షిఫ్ట్ చేయాలి. మొత్తంగా కొత్త పైపులైన్ వేసి ఈ ప్రాంత ప్రజలకు భద్రత కల్పించాలి.
 
  బాధితులకు మా పార్టీ అండగా ఉంటుంది. మా ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో పాటు గెయిల్, ఓఎన్జీసీ, పెట్రోలియం మంత్రులను కలిసి ఒత్తిడి తీసుకొస్తారు.
 
 అండగా ఉంటాం: జగన్
 
 సాక్షి, కాకినాడ: ధైర్యంగా ఉండండి.. త్వరలోనే కోలుకుంటారు.. మీకు అండగా నేను ఉంటానంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నగరం గ్యాస్ ప్రమాద బాధితులకు ధైర్యం చెప్పారు. హైదరాబాద్ నుంచి విమానంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు మధురపూడి చేరుకున్న జగన్ నేరుగా మామిడికుదురు మండలం నగరం చేరుకొని ఘటనాప్రాంతాన్ని పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును స్థానికులు, ప్రత్యక్షసాక్షులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. దాదాపు రెండుగంటలపాటు గ్రామంలోనే ఉండి విస్ఫోటం సృష్టించిన విధ్వంసాన్ని పరిశీలించి చలించిపోయారు. అనంతరం అమలాపురం చేరుకుని అక్కడి కిమ్స్ ఆస్పత్రిలో, ఆ తర్వాత కాకినాడ చేరుకొని అపోలో, ట్రస్ట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను  పరామర్శించారు.
Share this article :

0 comments: