విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజల్లోకి వెళ్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లాలో రెండు రోజుల పాటు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాలు ఆదివారం ముగిశాయి.
ఎన్నికల్లో గెలుపోటముల గురించి వైఎస్ జగన్ పార్టీ శ్రేణులతో చర్చించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం మరింత ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించుకుని లోటుపాట్లపై విశ్లేషించుకుందామని వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు చెప్పారు.
ఎన్నికల్లో గెలుపోటముల గురించి వైఎస్ జగన్ పార్టీ శ్రేణులతో చర్చించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం మరింత ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించుకుని లోటుపాట్లపై విశ్లేషించుకుందామని వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు చెప్పారు.
0 comments:
Post a Comment