విశాఖపట్నం: సమస్యలపై పోరాడుతూ ప్రజలకు అండగా ఉందామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. విశ్వప్రియ ఫంక్షన్హాల్లో జరుగుతున్న సమావేశంలో మొదటగా అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించారు. పెందుర్తి, మాడుగుల శాసనసభ స్థానాలపై సమీక్షలు ముగిశాయి. మాడుగుల నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన ముత్యాల నాయుడును జగన్ అభినందించారు. కార్యకర్తలు చెప్పిన అన్ని విషయాలను జగన్ విన్నారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మనం బలమైన ప్రతిపక్షంగా ఉన్నామని, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. గ్రామస్థాయి నుంచే క్యాడర్ని బలోపేతం చేయడానికి అందరు కృషిచేయాలని కార్యకర్తలను కోరారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం నుంచే పోరాడుదామన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా మాయమాటలు చెప్పారన్నారు. ఇచ్చిన హామీలు అమలుకు చంద్రబాబును నిలదీద్దామన్నారు.
0 comments:
Post a Comment