నెల్లూరు: ఎన్నికల మానిఫెస్టోలో వెల్లడించిన విధంగా, ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు విధించకుండా రైతు రుణమాఫీని అమలుచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
రుణమాఫీతోపాటు ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మేకపాటి సూచించారు. కమిటీలు వేశామని.. ఆర్ బీఐ అనుమతి కోసం వేచి చూస్తున్నామనే ప్రకటనలకే పరిమితం కాకుండా, కాలయాపన చేయకుండా రుణమాఫీని అమలు చేయాలని తెలుగుదేశం ప్రభుత్వానికి సూచించారు.
0 comments:
Post a Comment