స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి వైఎస్ జగన్ అంగీకారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి వైఎస్ జగన్ అంగీకారం

స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి వైఎస్ జగన్ అంగీకారం

Written By news on Thursday, June 19, 2014 | 6/19/2014

స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి వైఎస్ జగన్ అంగీకారం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసససభా స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఎన్నిక కానున్నారు. స్పీకర్ పదవికి ఆయన నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వానికి ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు పలికారు. కోడెల శివప్రసాదరావుకు మద్దతుగా నామినేషన్ పత్రాలపై జగన్ సంతకం చేశారు.

శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు.... జగన్ ను కలిసి స్పీకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించాలని కోరగా ఆయన అంగీకరించారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడంతో ఏపీ స్పీకర్ గా కోడెల శివప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. రేపు ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.
Share this article :

0 comments: