బ్లో అవుట్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బ్లో అవుట్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

బ్లో అవుట్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Written By news on Friday, June 27, 2014 | 6/27/2014

బ్లో అవుట్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో జరిగిన గెయిల్ పైపులైను పేలుడు సంఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన సంతాపం, సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోందని, వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రమాద సంఘటనపై విచారణ జరిపించాలని జగన్ కోరారు.

కాగా.. క్షతగాత్రుల్లో ఎనిమిదిమందిని అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో వారిని కాపాడేందుకు వైద్యబృందాలు శ్రమిస్తున్నాయి.

గెయిల్ పైప్ లైన్ పేలుడు ఘటన విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృష్టికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తీసుకెళ్లారు. పెట్రోలియం శాఖ మంత్రితో కూడా ఆయన మాట్లాడి సంఘటన వివరాలు తెలుసుకున్నారు.
Share this article :

0 comments: