విజయవాడ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. బందరు రోడ్డులోని కానూరులోని ఆహ్వానం కల్యాణ మండలంలో ఈ సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకు విజయవాడ తూర్పు నియోజక వర్గంపై సమీక్ష జరిగింది. అనంతరం విజయవాడ సెంట్రల్, మైలవరం, నంగదిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, పెడన, మచిలీపట్నం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాలసై వైఎస్ జగన్ సమీక్షిస్తారు.
ఆదివారం మచిలీపట్నం పార్లమెంట్ నియోజక వర్గపరిధిలోని పెనమలూరు, గన్నవరం, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాలపై సమీక్షలు జరగనున్నాయి. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతలు, పార్టీ మండల అధ్యక్షులు ఈ సమీక్ష సమావేశాల్లో పాల్గొన్నారు.
ఆదివారం మచిలీపట్నం పార్లమెంట్ నియోజక వర్గపరిధిలోని పెనమలూరు, గన్నవరం, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాలపై సమీక్షలు జరగనున్నాయి. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతలు, పార్టీ మండల అధ్యక్షులు ఈ సమీక్ష సమావేశాల్లో పాల్గొన్నారు.
0 comments:
Post a Comment