షార్ శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షార్ శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు

షార్ శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు

Written By news on Monday, June 30, 2014 | 6/30/2014

షార్ శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్ : షార్ శాస్త్రవేత్తలకు అభినందనల పరంపర కొనసాగుతోంది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం షార్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. పీఎస్ ఎల్ వీ సీ- 23 ప్రయోగం విజయవంతం కావటంపై ఆయన అభినందించారు. అంతరిక్ష ప్రయోగ రంగంలో అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా భారత్ ఎదుగుతోందని వైఎస్ జగన్ అన్నారు. భారత్ కీర్తి కిరీటంలో పీఎస్ ఎల్ వీ సి-23 ప్రయోగం మరో మైలురాయిగా ఆయన అభివర్ణించారు.

కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా శాస్త్రవేత్తలను అభినందనలు తెలిపారు. అంతకు ముందు ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాకెట్ వివిధ దశలను దాటుతూ కక్ష్యలోని విజయవంతంగా ప్రవేశించగానే శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
Share this article :

0 comments: