తండ్రికి ధీటుగా ప్రజాపక్షమే అజెండాగా..! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తండ్రికి ధీటుగా ప్రజాపక్షమే అజెండాగా..!

తండ్రికి ధీటుగా ప్రజాపక్షమే అజెండాగా..!

Written By news on Tuesday, June 24, 2014 | 6/24/2014

తండ్రికి ధీటుగా ప్రజాపక్షమే అజెండాగా..!
అసెంబ్లీ ప్రారంభమైంది. జనంలో ఆసక్తి అధికంగా కన్పించింది. తొలిసారి ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం వినాలనే తలంపు ఎక్కువైంది. అంతలోనే ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ తొలిసారి ప్రసంగం మొదలు పెట్టారు. ప్రజల ప్రక్షపాతిగా, వారి సమస్యలే అజెండాగా అధికార పక్షాన్ని ధీటుగా ఢీకొన్నారు. ఉక్కిరిబిక్కిరైనా అధికార పక్షం అడుగడుగునా అడ్డు తగులుతున్నా వాటిని సమర్థవంతంగా తిప్పి కొట్టారు. ఎన్నికల హామీలను విస్మరించడంపై టీడీపీ అధినేత వైఖరిని కడిగిపారేసి తండ్రికి తగ్గ తనయుడుగా... అసలు సిసలైన ప్రజాపక్షపాతిగా వైఎస్ జగన్ నిలిచారు.

ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల పక్షపాతి. ప్రజా సమస్యలే ఏకైక ఎజెండాగా మెలగాల్సిన నేత. ఆ స్ఫూర్తితో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా జనానికి అండగా నిలిచారు. పదేళ్లు కిందట అసల సిసలైన ప్రజల పక్షపాతిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాంటి ప్రతిపక్ష నాయకుడుగా వైఎజ్ జగన్ నిలవనున్నారని తండ్రిగా తగ్గ ప్రజాపక్షపాతిగా తొలిరోజే నిరూపించారని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే కాకుండా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలో వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష నేతలు కూడా ప్రశంసించటం విశేషం.
Share this article :

0 comments: