ఎమ్మెల్యేలతో కలిసి బస్సులో అసెంబ్లీకి వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎమ్మెల్యేలతో కలిసి బస్సులో అసెంబ్లీకి వైఎస్ జగన్

ఎమ్మెల్యేలతో కలిసి బస్సులో అసెంబ్లీకి వైఎస్ జగన్

Written By news on Thursday, June 19, 2014 | 6/19/2014

ఎమ్మెల్యేలతో కలిసి బస్సులో అసెంబ్లీకి వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు బయల్దేరారు. లోటస్ పాండ్ నుంచి  పార్టీ ఎమ్మెల్యేలతో పాటు వైఎస్ జగన్ కూడా బస్సులో బయల్దేరి వెళ్లారు. ముందుగా పంజాగుట్టలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద వైఎస్ జగన్ తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. అటునుంచి వారంతా అసెంబ్లీకి వెళ్లనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు అంజలి ఘటించనున్నారు.

కాగా ఈ అసెంబ్లీ సమావేశాలు ఐదురోజుల పాటు కొనసాగనున్నాయి. తొలిరోజు 19వ తేదీన సభ్యుల ప్రమాణ స్వీకారాలు, మరణించిన సభ్యులకు సంతాప తీర్మానాలు ఉంటాయి. రెండో రోజు 20న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 21న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 22న సెలవు. 23, 24 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ ఉంటుంది. శాసన మండలి ఈ నెల 23, 24 తేదీల్లో సమావేశమవుతుంది. అక్కడ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది.
Share this article :

0 comments: