గుంటూరు సమీక్ష సమావేశాల షెడ్యూల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గుంటూరు సమీక్ష సమావేశాల షెడ్యూల్

గుంటూరు సమీక్ష సమావేశాల షెడ్యూల్

Written By news on Tuesday, July 22, 2014 | 7/22/2014

24న గుంటూరుకు జగన్
► మూడు రోజులపాటు పార్టీ సమావేశాలు
 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు
► వైఎస్సార్ సీపీ నాయకులు, విభాగాల సభ్యులు హాజరు కావాలని జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపు
సమీక్ష సమావేశాల షెడ్యూల్ ఇలా...
24వ తేదీ...
ఉదయం 9 గంటలకు: గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలు
మధ్యాహ్నం 12 గంటలకు : పొన్నూరు, ప్రత్తిపాడు
మధ్యాహ్నం 2 గంటలకు : తాడికొండ, మంగళగిరి
 
25వ తేదీ ..
ఉదయం 9 గంటలకు : తెనాలి, చిలకలూరిపేట
మధ్యాహ్నం 12 గంటలకు : సత్తెనపల్లి, పెదకూరపాడు
మధ్యాహ్నం 2 గంటలకు : మాచర్ల, గురజాల
సాయంత్రం 5 గంటలకు : వినుకొండ, నరసరావుపేట
రాత్రి 7 గంటలకు : రేపల్లె

26వ తేదీ..
ఉదయం 9 గంటలకు : 
బాపట్ల, వేమూరు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఈ నెల 24న గుంటూరు రానున్నారు. ఆయన అధ్యక్షతన  24, 25, 26 తేదీల్లో పార్టీ సమీక్ష సమావేశాలు వరసగా మూడు రోజుల పాటు గుంటూరులో జరగనున్నాయి. ఇందుకు పలకలూరు రోడ్డులోని ‘రమణీయం’ కల్యాణ మండపాన్ని వేదిక నిర్ణయించారు. వీటికి సంబంధించిన షెడ్యూల్‌ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ సోమవారం సాయంత్రం విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు..
► జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, బాపట్ల  మూడు పార్లమెంటు స్థానాలతో పాటు, 17 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన సమీక్ష జరుగుతుంది.
► పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, శాసనసభ్యులు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసిన అభ్య ర్థులు, ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలి.
► వీరితోపాటు జిల్లా, నియోజకవర్గాల పరిధిలోని, అన్ని విభాగాల సభ్యులు హాజరు కావాలి. కేంద్ర కమిటీ సభ్యులు, కేంద్ర పాలక మండలి సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా హాజరు కావాలి.
ఈ సమావేశాలకు పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎం.వి.మైసూరారెడ్డి హాజరు కానున్నారు.
► పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి 24వ తేదీ ఉదయం గుంటూరు చేరుకుంటారు. నియోజకవర్గ సమీక్షల్లో నేతలు తప్పక పాల్గొనాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ సూచించారు.
► విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), లేళ్ల
అప్పిరెడ్డి, కత్తెర సురేష్‌కుమార్, కొత్త చినపరెడ్డి, పురుషోత్తం, నూనె ఉమామహేశ్వరరెడ్డి, బీసీసెల్ కన్వీనర్ మద్దుల రాజాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: