చిత్తూరు : చిత్తూరు జిల్లా చంద్రగిరిలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రుణ మాఫీ చేయాలంటూ తహసిల్దార్ కిరణ్ కుమార్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో కొంతమంది నాయకులు కలిసి వినతిపత్రం అందించారు. అయితే, వైఎస్ఆర్ సీపీ నాయకుల నుంచి వినతిపత్రం తీసుకుంటారా అంటూ తహసిల్దార్ పై తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు చెయ్యి చేసుకున్నారు. అయినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు.
దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన విషయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులపై చర్య తీసుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాకు దిగారు. వారికి పోటీగా టీడీపీ నేతలు కూడా ధర్నాకు దిగారు. పోటాపోటీ ధర్నాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.
దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన విషయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులపై చర్య తీసుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాకు దిగారు. వారికి పోటీగా టీడీపీ నేతలు కూడా ధర్నాకు దిగారు. పోటాపోటీ ధర్నాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.
0 comments:
Post a Comment