మేడికొండూరు ఘటనపై వైఎస్ జగన్ ఆరా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మేడికొండూరు ఘటనపై వైఎస్ జగన్ ఆరా

మేడికొండూరు ఘటనపై వైఎస్ జగన్ ఆరా

Written By news on Sunday, July 13, 2014 | 7/13/2014

మేడికొండూరు ఘటనపై వైఎస్ జగన్ ఆరా
హైదరాబాద్: మేడికొండూరు ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. పార్టీ నాయకుడు అంబటి రాంబాబుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫాకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసాయిచ్చారు.

గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. ఏడుగురు ఎంపీటీసీ సభ్యులతో వెళుతున్న వైఎస్ఆర్ సీపీ నాయకుల వాహనాలపై దాడి చేశారు. నలుగురు ఎంపీసీలను కిడ్నాప్ చేశారు. దీనిపై వైఎస్ఆర్ సీపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దాడికి గురైన నాయకులు సంఘటనా స్థలంలోనే ధర్నా చేపట్టారు. కిడ్నాప్ చేసిన నలుగురు ఎంపీటీసీలను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు
Share this article :

0 comments: