మహానేత వైఎస్‌ఆర్ కు ఘన నివాళి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మహానేత వైఎస్‌ఆర్ కు ఘన నివాళి

మహానేత వైఎస్‌ఆర్ కు ఘన నివాళి

Written By news on Wednesday, July 9, 2014 | 7/09/2014


ఇడుపులపాయలో వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిల, భారతి, కుటుంబసభ్యుల ప్రత్యేక ప్రార్థనలు
వేంపల్లె: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని మంగళవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలు మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం కుటుంబ సభ్యులతో కలసి వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ 65వ జయంతి వేడుకలు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో జరిగాయి. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డితోపాటు వైఎస్ సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిలమ్మ, కోడలు భారతిరెడ్డి, షర్మిల కుమార్తె అంజలి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి, ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, మాజీ ఎమ్మెల్యే వైఎస్ పురుషోత్తమరెడ్డి, జగన్ మామ ఈసీ గంగిరెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, కమలమ్మ, వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ అవినాష్‌రెడ్డి సతీమణి సమతారెడ్డి తదితరులు వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెవరెండ్ నరేష్‌బాబు సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.    
 వైఎస్ ఆశయాలు సాధిస్తాం: ఎంపీలు
 వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి మహానేతను కోల్పోవడం రాష్ట్రానికే కాకుండా దేశానికి పెద్దలోటని వైఎస్సార్ సీపీ ఎంపీలు పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో దివంగత వైఎస్సార్ ఆశయ సాధనకు అంతా కృషి చేస్తామని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం ఢిల్లీలోని లోధీఎస్టేట్-26లో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరప్రసాదరావు, కొత్తపల్లి గీత, బుట్టా రేణుక పాల్గొన్నారు. వైఎస్ చిత్రపటం వద్ద నివాళులర్పించిన అనంతరం కేక్ కోశారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ..   ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా రాజశేఖరరెడ్డి పరిపాలన కొనసాగిందన్నారు. అందుకే ప్రజలు ఆయనను ఇప్పటికీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారన్నారు.
 పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతల శ్రద్ధాంజలి
 హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి.. వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తరువాత యర్రగొండపాలెం, మార్కాపురం ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి సంయుక్తంగా కేక్‌ను కోసి పంచారు. ఆ తరువాత పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కార్యాలయ ప్రాంగణంలో రక్తదాన శిబిరం ఏర్పాటుతో పాటు, పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు ఎన్.లక్ష్మీపార్వతి, నల్లా సూర్యప్రకాశరావు, వాసిరెడ్డి పద్మ, గట్టు రామచంద్రరావు, విజయచందర్, బి.జనక్‌ప్రసాద్, పీఎన్వీ ప్రసాద్, పుత్తా ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్‌సీ ఎల్పీ కార్యాలయంలో పార్టీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్  వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. 
 మహానేతకు కాంగ్రెస్ నివాళి
 వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం స్థానిక ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు. పంజగుట్టలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమాల్లో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, నాయకులు వట్టి వసంతకుమార్, శైలజానాథ్, కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


రాజన్నకు ఘన నివాళి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిని ప్రజలు తమ గుండెల్లో నిలుపుకున్నారు. ఆయన జయంతిని మంగళవారం వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు. పలుచోట్ల వైఎస్‌ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. పూజలు నిర్వహించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

తిరుపతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి65వ జయంతిని జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు మంగళవారం ఘనంగా జరుపుకున్నాయి. తిరుపతి తుడా సర్కిల్‌లో వైఎస్ విగ్రహానికి పార్టీ కేంద్రపాలకవర్గ సభ్యుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పూజలు నిర్వహించి, నివాళులర్పించారు. పార్టీ పట్టణశాఖ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మదనపల్లె పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్‌ఆర్ జయంతి వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు దేశాయ్ తిప్పారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

పలువురు పార్టీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరై వైఎస్‌ఆర్ చిత్ర పటానికి పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు. పుంగనూరులో జరిగిన జయంతి వేడుకల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, జెడ్‌పీటీసీ మాజీ సభ్యుడు వెంకటరెడ్డియాదవ్ పాల్గొన్నారు. పలమనేరులో ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాలయంలో వరుణయాగం జరిపించారు.

వర్షాలు విరివిగా కురిసి వ్యవసాయం అభివృద్ధి చెంది వైఎస్‌ఆర్ ఆశయాలు నెరవేరాలని మొక్కుకున్నారు. పేదలకు అన్నదానం చేశారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో కార్యకర్తలు వైఎస్‌ఆర్ చిత్రపటాలకు పూజలు నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. గంగాధర నెల్లూరు నియోజవర్గంలోని పలు మండ లాల్లో జరిగిన వైఎస్‌ఆర్ జయంతి వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.నారాయణస్వామి పాల్గొన్నారు.

ఆయన ఆధ్వర్యంలో కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో పార్టీ నాయకులు,కార్యకర్తలు వైఎస్‌ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో బి కొత్తకోట, మొలకలచెర్వు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల్లో వైఎస్‌ఆర్ జయంతి కార్యక్రమాలు జరిగాయి.

చిత్తూరు డీసీసీబీ కార్యాలయం ఆవరణలోని వైఎస్‌ఆర్ విగ్రహానికి జంగాలపల్లి శ్రీనివాసులు, పార్టీ మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. వృద్ధాశ్రమంలో అనాథలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. మాజీ శాసనసభ్యుడు ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అనుప్పల్లెలోని వైఎస్‌ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

 కుప్పంలో పార్టీ నియోజకవర్గ నాయకుడు చంద్రమౌళి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్  విగ్రహానికి పాలాభిషేకం చేసి, స్థానిక బధిర పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంచిపెట్టారు. అన్నదానం చేశారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుబ్రమణ్యం రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూజలు చే సి ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.

బంగారుపాళెం, యాదమరి, త వణంపల్లెల్లో జరిగిన వైఎస్‌ఆర్ జయంతి వేడుకల్లో స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ సునీల్ పాల్గొన్నారు. సత్యవేడులో నియోజకవర్గం ఇన్‌చార్జ్ ఆదిమూలం ఆధ్వర్యంలో కార్యకర్తలు వైఎస్‌ఆర్ చిత్రపటానికి  నివాళులు అర్పించిన అనంతరం స్వీట్లు పంచిపెట్టారు.



రాజన్నా.. నిను మరువలేమన్నా
లావేరు: మండలంలోని అదపాక గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైఎస్ జయంతి సందర్బంగా మంగళవారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆవిష్కరించారు. ముందుగా గ్రామంలో వైసీపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ మాటలు మరిచారని ఆయన విమర్శించారు. ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు వైసీపీ ఎచ్చెర్ల సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, రణస్థలం జెడ్పీటీసీ గొర్లె రాజగోపాల్, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ రొక్కం బాలక్రిష్ణ, రణస్థలం ఎఫ్‌ఎస్‌సీఎస్ అధ్యక్షడు బొంతు సూర్యనారాయణ పాల్గొన్నారు.

 రాజన్న పాలనలోనే రాష్ట్రం సుబిక్షం : ధర్మాన ప్రసాదరావు
 అరసవల్లి: వైఎస్ రాజశేఖరెడ్డి పాలనలోనే రాష్ట్రం ఎంతో సుబిక్షంగా ఉందని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కొనియాడారు. మంగళవారం వైఎస్సార్ జయంతి సందర్బంగా వైఎస్సార్ కూడలిలో రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు.  కార్యక్రమంలో పార్టీ నేత రెడ్డి శాంతి, వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ సభ్యుడు అందవరపు సూరిబాబు, రాష్ట్ర పార్టీ మహిళా విభాగ సభ్యురాలు కామేశ్వరి, మాజీ మున్సిపల్ చైర్మన్‌లు అందవరపు వరం తదితరులు పాల్గొన్నారు.

 పేదల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు : ఎమ్మెల్యే కంబాల
 రాజాం రూరల్: పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పట్టణంలోని మాధవ బజార్ జంక్షన్‌లో వైఎస్‌ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

 వైఎస్సార్ లేని లోటు తీర్చలేనిది : ఎమ్మెల్యే కలమట
 పాతపట్నం: ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి అందించని సువర్ణ పాలన అందించిన ఘనత ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని ఆయన లేని లోటు పూడ్చలేనిదని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. స్థానిక ఆసుపత్రి జంక్షన్ వద్ద రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.  మండల కన్వీనర్ కొండాల అర్జునుడు, పార్టీ సీనియర్ నాయకులు గంగు వాసుదేవరావు, రేగేటి షణ్ముఖరావు, ఎరుకోల వెంకటరమణ, టి భుజంగరావు,జి లుట్టిబాబు, బంకి నరసయ్య, సిర్ల ప్రభాకరరావు, కొమరాపు రాము, బెన్న నాగేశ్వరరావు, బచ్చల వసంతరావు, నల్లి లక్ష్మణరావు, కనకల కర్రెన్న, ఇప్పిలి సింహాచలం, సిర్నిల్లి గురయ్య,రోణంకి లక్ష్మీపతి, శిష్టు తారకరామారావు, కొండాల ఎరకయ్య, అమర శ్రీరాములు, డకర సన్యాసి,ఎస్ గోవిందరాజులు,ఎస్ చిన్నయ్య, తేజ, జోగారావు, పాల్గొన్నారు.

 రోగుల పళ్లు పంచిన ఎమ్మెల్యే కళావతి
 పాలకొండ: పాలకొండ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో జరిగిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. పాలకొండ పట్టణం, మండలంతో పాటు వీరఘట్టం, భామిని, సీతంపేటలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలకొండ ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు.



నీ కీర్తి.. సదా స్ఫూర్తి
పాలమూరు:  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి వేడుకలను మంగళవారం జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా పలుచోట్ల జయంతి కార్యక్రమాలు జరిగాయి. ‘వైఎస్‌ఆర్ అమర్హ్రే.. రైతుబంధువు జోహార్’ అంటూ అంజలి ఘటించారు.
 
 రైతుల కోసం నిరంతరం తపించి వ్యవసాయానికి వన్నె తెచ్చిన వైఎస్ జన్మదినాన్ని ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించాలని పలువురు నేతలు డిమాం డ్ చేశారు. నీకీర్తి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి పార్టీ జిల్లా కార్యాల యంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి మెట్టుగడ్డ సమీపంలో ఉన్న అంధుల ఆశ్రమ పాఠశాల, ఏనుగొండలో ఉన్న రెడ్‌క్రాస్ అనాథ ఆశ్రమంలో విద్యార్థులకు పండ్లు పంచిపెట్టారు.  
 
 జిల్లావ్యాప్తంగా
  వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి భగవంతురెడ్డి ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌లో వైఎస్‌ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కల్వకుర్తిలో నగర పంచాయతీ వైస్‌చైర్మన్ షాషెద్ ఆధ్వర్యంలో వేడుకలను జరిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు.
  జడ్చర్లలో వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ నాయకుడు పాండునాయక్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీచేశారు. అచ్చంపేట మండలంలో పార్టీ మండల కన్వీనర్ కొండూరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. బొమ్మన్‌పల్లిలో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.
 
 అనంతరం అక్కడి లెనిటి ఫౌండేషన్ అనాథవృద్ధుల ఆశ్రమంలో పండ్లు, బ్రెడ్డు పంపిణీచేశారు. షాద్‌నగర్‌లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, బొబ్బిలి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ముఖ్య కూడలిలో ఉన్న వైఎస్ విగ్రహనికి పూలమాలలు వేశారు. అనంతరం స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిలో రోగులకు బ్రెడ్డు, పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోన దేవయ్యతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
 
  మక్తల్ పట్టణంలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి అంజలి ఘటించి..వేడుకలు జరుపుకున్నారు. నర్వ మండలంలోని నర్వ, లంకాల, జిన్నారం, కన్మనూర్, జంగంరెడ్డిపల్లి, కల్వాల, యాంకి గ్రామాల్లో జయంతి కార్యక్రమాలు జరిగాయి. నారాయణపేటలో వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జమీర్‌పాషా, పట్టణ అధ్యక్షులు యూసుఫ్‌తాజ్ ఆధ్వర్యంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కొత్తకోట మండలం అజ్జకొల్లు గ్రామంలో వైఎస్ చిత్రపటానికి నివాళులర్పించారు. గోపాల్‌పేట మండలకేంద్రంలో వైఎస్ అభిమానులు, వైఎస్‌ఆర్ సీపీ నేతలు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
 
 కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
 మహబూబ్‌నగర్ అర్బన్: జడ్చర్లలో కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి నిత్యానందం ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గద్వాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మునిసిపల్ చైర్‌పర్సన్ బండల పద్మావతి, మార్కెట్‌యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి ఇతర నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
 వైఎస్‌ఆర్ రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని స్థానిక మునిసిపల్ చైర్‌పర్సన్ సి.రాధాఅమర్ కొనియాడారు. వైఎస్ జయంతిని పురస్కరించుకుని ఆమె మహబూబ్‌నగర్ పట్టణంలోని స్థానిక వైఎస్‌ఆర్ చౌరస్తాలో వైఎస్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషిచేశారని కొనియాడారు. ఆయన సంక్షేమ పథకాలలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని కొనియాడారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు ముత్యాలప్రకాశ్ మాట్లాడుతూ.. జిల్లాలో భారీ సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన ఘనత వైఎస్‌కే దక్కిందన్నారు. ఆయన ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా జిల్లా నుంచే ప్రారంభించే వారని గుర్తుచేశారు.


నిజామాబాద్ అర్బన్:  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌భవన్‌లో డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హుందాన్, అధికార ప్రతినిధి తిరుపతిరెడ్డి వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాహెర్‌బిన్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించారని పేర్కొన్నారు. విద్యా, వైద్య, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు.

ప్రజల సమస్యల ను పరిష్కరించడంలో ముందుండేవారని, మాట ఇచ్చి మడమ తిప్పని నేత ని గుర్తు చేసుకున్నారు. జిల్లాలో వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు నిరుపేదలకు ఎంతో అండగా నిలిచాయన్నారు. పార్టీ కష్టకాలంలో ఉంటే రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. జిల్లాతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల, యూనివర్సిటి మంజూర్ చేసిన ఘనత ఆయనకే చెల్లుతుందన్నారు. పేదల అభ్యున్నతికి పాటుపడిన మహానీయుడు రాష్ట్రాన్ని అభివృద్ది పథంలోకి తీసుకెళ్తున్న క్రమంలో ఆకస్మాత్తుగా మరణించటం దురదృష్టకరమన్నారు.

 ఆయన మృతి పార్టీకి ఎప్పటి తీరనిలోటుగా మిగిలిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకు లు తిరుపతిరెడ్డి, రాజశేఖరరావు, భోజన్న, సుభాష్ జాదవ్, ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు, నందిపేట్, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి ఎంపీటీసీలు, వివిధ మండలాల అధ్యక్షులు, సర్పంచులు పాల్గొన్నారు.

 విద్యార్థులకు నోట్‌బుక్కులు, పలకల పంపిణీ
 వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని వైఎస్సార్‌సీపీ నాయకుడు వర్ని మండలం బడాపహాడ్‌లో స్కూల్ విద్యార్థులకు నోట్‌బుక్కులు, పలకలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. వర్ని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్లలో ఆయా మండలాల్లో కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ నాయకులు వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

జిల్లా కేంద్రంలో  వైఎస్‌ఆర్ వీరాభిమాని ఎజాజ్ తిరుమల టాకీస్ చౌరస్తాలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. బాల్కొండ మండలంలోని రెంజర్ల, మెండోరాలో వైఎస్సార్ అభిమానులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు జయంతి కార్యక్రమాలలో పాల్గొన్నారు. వైఎస్ చేసిన అ భివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. భిక్కనూరు మండల కేంద్రంలో, దోమకొండలో. జిల్లాలోని పలు ప్రాంతాలలోనూ వైఎస్‌ఆర్ జయంతి కార్యక్రమాలు ఘ నంగా జరిగాయి.


నెల్లూరు : జిల్లాలో దివంగత ముఖ్యమం త్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి వేడుకల ను మంగళవారం వాడవాడలా ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకా లు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అన్నదానాలు నిర్వహించారు. వికలాంగులకు వస్త్రాలు పంపిణీ చేశారు. నెల్లూరు నగరంలోని కరెంట్ ఆఫీస్ సెం టర్‌లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జి ల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  మేరిగ మురళీధర్ ఆ ధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ జ యంతి వేడుకలను నిర్వహించారు.

 వైఎస్సార్ చి త్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పార్టీ నేతలు బండ్లమూడి అనిత, బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, పాండురంగారెడ్డి, చంద్రమౌళి పా ల్గొన్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ నాయకత్వంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ గాంధీబొమ్మసెంటర్‌లో వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి ముక్కాల  పూ ల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్‌చేసి స్వీట్లు పంచారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కేక్ కట్‌చేసి స్థానికులకు పంచి పెట్టారు.
 
 కార్యక్రమంలో విద్యార్థి నేతలు జయవర్ధన్, శ్రావణ్  పాల్గొన్నారు. కోవూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు జరి గాయి. ఆత్మకూరు, చేజర్ల మండలాల్లో పార్టీ నేత లు జయంతి వేడుకలు నిర్వహించారు. కావలిలో వైఎస్సార్ విగ్రహాలకు కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించి పూలమాలలతో నివాళులర్పించారు. కావలిలో వైఎస్సార్‌సీపీ నేతలు వికలాంగులకు దుస్తులు పంపిణీ చేశారు. గూడూరు టవర్ క్లాక్ వద్ద వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
 
 సర్వేపల్లిలో వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహిం చారు. సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీ వయ్య వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొన్నా రు. పార్టీ నేతలు దబ్బల రాజారెడ్డి, సత్యనారాయణరెడ్డి, బాలాచంద్రారెడ్డి పాల్గొన్నారు. తడలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వెంకటగిరిలో స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు అనాథాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.  అన్నదానం చేశారు. తొలుత వైఎస్సార్ విగ్రహాని కి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఉదయగిరి, దుత్తలూరుతో పాటు అన్ని మండలాల్లో వైఎ స్సార్ విగ్రహాలకు పాలాభిషేకం, పూలమాలల తో అభిమానులు నివాళులర్పించారు.
Share this article :

0 comments: