కన్నీళ్లు తుడుస్తూ... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కన్నీళ్లు తుడుస్తూ...

కన్నీళ్లు తుడుస్తూ...

Written By news on Saturday, July 19, 2014 | 7/19/2014

కన్నీళ్లు తుడుస్తూ...
అసలే వలస బతుకులు...కూలీనాలీ చేసుకుంటూ ఎలాగోలా జీవనాన్ని నెట్టుకొస్తున్న వారిపై మృత్యువు పంజా విసిరింది. ఇంటి పెద్ద దిక్కులను కబళించింది. తీరని శోకం మిగిల్చింది. చెన్నైలో ఇటీవల సంభవించిన రెండు ప్రమాదాల్లో తమవారిని కోల్పోరుు పుట్టెడు దుఃఖంలో ఉన్న పలు కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు శుక్రవారం పరామర్శించారు. వారి ఆవేదనను ఆలకించారు. కన్నీళ్లు తుడిచారు. ప్రమాద కారణాలు తెలుసుకుని ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. నష్టపరిహాం అందజేసేందుకు పార్టీ తరఫున చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు.             -నరసన్నపేటరూరల్/సారవకోట రూరల్/టెక్కలి/కోటబొమ్మాళి/భామిని
 
సత్రాం గ్రామంలో రాము తల్లిదండ్రులను ఓదారుస్తూ...
జగన్: మీకు అందివచ్చిన కొడుకు మరణించడం నన్ను కలచివేసిందమ్మా...
సరోజిని, సిమ్మయ్య(మృతుని తల్లిదండ్రులు): అవును బాబూ.. మాకు ముగ్గురు కుమారులు. పెద్దవాడు రాము సంపాదన మీదే ఆధారపడి బతుకుతున్నాం.

జగన్: చెన్నై ఎప్పుడు వెళ్లారు?
సిమ్మయ్య: మూడు మాసాల కిందట పెద్దోడు రాము, చిన్నోడు భాస్కరరావుతో కలిసి నేను కూడా వెళ్లాను. వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో చిన్నోడు, నేను వచ్చేసినాం. పెద్దోడు అక్కడే ఉండిపోరుు గోడ కూలిన ఘటనలో చనిపోయూడు. సరోజిని కలుగుజేసుకుని ఇదే ప్రమాదంలో నా తమ్ముళ్లు, వారి పిల్లలు చనిపోయూరయ్యూ అంటూ భోరున విలపించింది.

జగన్: వారిది కూడా ఇదే ఊరా?
సరోజిని: లేదయ్యా... వారిది చుట్టిగుండం

జగన్: ప్రభుత్వం నుంచి సాయం అందిందా?
మృతిని తండ్రి: మన ప్రభుత్వం నుంచి వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు.

జగన్: మన ఎమ్మెల్యేలను తమిళనాడు పంపించి మంచి లాయర్లను ఏర్పాటు చేసి మీ బాధ వినిపించేలా చేస్తాను. అక్కడే ఉన్న రాము తమ్ముళ్లు చిన్నారావు, భాస్కరరావుల క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు.  

జగన్: మీరిద్దరూ ఏమి చేస్తున్నారు? (మృతిని తమ్ముళ్లను )
చిన్నారావు: 
నేను ఇంటర్మీడియెట్ చదువుతున్నాను, తమ్ముడు భాస్కరరావు భవన నిర్మాణ కార్మికుడు.

జగన్: నీవు చదువు కోలేదా?
భాస్కరరావు: 
చదువు మానేశాను.

జగన్: చదువుకుని ఉంటే బాగుండేది కదా... ఇప్పుడు అక్కడకెళ్లి కూలి పని చేస్తావు. తరువాత మేస్త్రీ అవుతావు అంతే కదా... చదువుకుంటే మంచి భవిష్యత్ ఉంటుంది కదా. ఇద్దరు పిల్లల్ని చదివించండి. వారికి మంచి భవిష్యత్ ఇవ్వండి. మన దాసన్న రెండు రోజులలో వస్తారు.. మీకు ఆర్థికంగా సహాయం అందిస్తారు.
 
బాలసీమలో దువ్వారపు పద్మ కుటుంబ సభ్యులతో...
జగన్: భవనం కూలిపోరుు పద్మ చనిపోవడం చాలా బాధగా ఉందయ్యూ...
అప్పన్న(పద్మ భర్త): కళ్లముందే నా భార్య చనిపోయింది సార్. నేను కూడా ఈ ప్రమాదంలో చిక్కుకోవల్సింది. నాకు పని లేదని మేస్త్రి చెప్పడంతో పక్క బిల్డింగ్‌లో పనికి వెళ్లాను. మరో అరగంటలో పని నుంచి బయటకు వస్తారనగా బిల్డింగ్ కూలింది. అడుగున ఉన్న అంతస్తులో నా భార్య చిక్కుకుంది.

జగన్: ఎంతమంది పనికి వెళ్లారు. రోజుకు  కూలి ఎంత వస్తుంది?
అప్పన్న: నేను, నా భార్య, అన్నలు ఇద్దరు, అన్న భార్యలు కలిసి పనికెళ్లాం. ఎలచ్చన్లకు వచ్చి ఓటేసి మళ్లీ వెళ్లాం. రోజుకు మేస్త్రీకి రూ. 500, ఆడమనిషికి రూ.250 ఇస్తారు.

జగన్:  ప్రభుత్వం సాయం చేసిందా..
అప్పన్న: 
రెండు దఫాలు పిలిచి  రూ.ఏడు లక్షలు ఇచ్చారు.

జగన్: బిల్డర్ నుంచి ఆర్థిక సహాయం అందిందా?
అప్పన్న:  
లేదు సార్. బిల్డింగ్ కూలిన వెంటనే వాళ్లను పోలీసులు పట్టుకు పోయారు. మాకు పైసా కూడా ఆయన నుంచి రాలేదు. మీరే ఏదో ఒకటి చేయాలి.

జగన్: వైఎస్సార్ సీపీ తరఫున మా ప్రయత్నం మేము చేస్తాం. దాసన్నతో పాటు మన పార్టీ ఎమ్మెల్యేలను కొందరిని తమిళనాడు పంపుతాం. అక్కడి ప్రభుత్వంతో వారు మాట్లాడతారు. అనంతరం మంచి లాయరును పెట్టి కేసు వేద్దాం.

జగన్: ఎంతమంది పిల్లలు? చదువుతున్నారా?
అప్పన్న: ఇద్దరు పిల్లలు సార్. పాప లక్ష్మి పెద్దది. శ్యామలరావు కుమారుడు. వీరి కోసమే నాభార్య ఎక్కువగా కష్టపడేది. లక్ష్మి ఇంటర్ చదువుతుంది. శ్యామలరావు టెన్త్‌కు వచ్చాడు. మా పిల్లలను మీరే ఆదుకోవాలి సార్.

జగన్: పిల్లలను బాగా చదివించు. పాపను నర్సింగ్‌లో చేర్పించు. తన కాళ్ల మీద తను నిలబడుతుంది. పిల్లలిద్దరినీ బాగా చదువుకోవాలంటూ ఆశీర్వదించారు.
 
కొరమలో దాసరిరాము, దాసరి కుమారి కుటుంబ సభ్యులతో...
జగన్: అమ్మా... దంపతులిద్దరూ మరణించడం దారుణం. పిల్లలు అనాథలయ్యూరు. దేవుడు మీ కుటుంబానికి అన్యాయం చేశాడు...
అప్పలనర్సమ్మ, ప్రకాశ్(మృతుని తల్లి, సోదరుడు):అవును బాబూ... దేవుడు మా కుటుంబానికి కష్టాలు తెచ్చాడు.

జగన్: ప్రమాదానికి కారణమైన బిల్డర్ నుంచి పరిహారం వచ్చిందా?
ప్రకాశ్: రాలేదు

జగన్: పరిహారం కోసం మీ తరఫున కేసు వేద్దాం. నాణ్యత లేని భవనాలు నిర్మించిన బిల్డర్‌ను బాధ్యుడిని చేద్దాం?
ప్రకాశ్
అలాగేనండి... పరిహారం వచ్చేలా చూడండి సార్.

జగన్:  వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే, ఎంపీలతో ఒక కమిటీ వేశాం. వీరు చెన్నైవెళ్లి మీ తరఫున పోరాటం చేస్తారు. మీలో ఎవరో ఒకరు వారితో వెళ్లండి చాలు.
అప్పలనర్సమ్మ: అలాగే బాబూ. మీరు చెప్పినట్లు వింటాం.
జగన్: మృతుల పిల్లలు మణికంఠ, సంధ్యలను దగ్గరకు తీసుకుని... బాగా చదువుకోండి అంటూ దీవించారు.
అప్పలనర్సమ్మ: దిక్కులేని పిల్లలకు చదవు లెలాసాగుతాయి నాయినా?

జగన్: పిల్లల బాధ్యత తీసుకుంటాం. మా ఎమ్మెల్యే విశ్వాసరారుు కళావతి పిల్లలిద్దరినీ పాఠశాలలో చేర్పించి చదువుకు సాయం చేస్తారు.
అప్పలనర్సమ్మ: ఆదుకోండి బాబూ. మీరే దిక్కు...

జగన్: తప్పకుండా... పార్టీ తరఫున ఎమ్మెల్యే ద్వారా సాయం చేస్తాం.

జగన్: గ్రామం నుంచి ఎంతమంది వలసలు వెళ్లారు?
ప్రకాశ్: 
కొరమ నుంచి సుమారు 50 మంది వరకు చెన్నైలో పనిచేస్తున్నారు.

జగన్: జాబ్ కార్డులందరికీ ఉన్నాయా?
ప్రకాశ్: లేవు సార్,  ఉపాధి పనులు కూడా లేవు.

జగన్: ప్రభుత్వం నుంచి పరిహారం అందిందా?
ప్రకాశ్:
 అందింది. రెండు విడతులుగా ఇచ్చారు.
 
చుట్టిగుండంలో మృతుల కుటుంబ సభ్యులతో...
జగన్: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడం బాధగా ఉందమ్మా...
మృతులు సిమ్మయ్య, అప్పయ్యల చెల్లెలు చిన్నమ్మడు:అవును బాబూ... ఇప్పటికీ తెరుకోలేకపోతున్నాం.. ఆ దేవుడు మా కుటుంబానికి అన్యాయం చేశాడు. నేను చెన్నైలో గోడకూలి చనిపోయిన సిమ్మయ్యకు అక్కనవుతాను... అప్పయ్యకు చెల్లెలనవుతాను... వీరితో పాటు మా ఇద్దరు వదినలు ఉమా, లక్ష్మీలు, చిన్న మేనల్లుడు జగదీష్ కూడా చనిపోయారు.

జగన్: అసలు ప్రమాదం ఎలా జరిగింది...?
మృతుడు అప్పయ్య కుమారుడు ప్రసాద్: మా అమ్మా నాన్న, మా పెద్దనాన్న పెద్దమ్మలు.. పని చేస్తున్న దగ్గర్లో ఉన్న ప్రహరీ ఆనుకుని పాకలు వేశారు. ఆ రాత్రి గోడకు వెనుక నుంచి వాహనం ఢీ కొనడంతో గోడ కూలిపోయి ఉండవచ్చని అక్క డే పనిచేస్తున్న కొంత మంది తెలిసిన వారు  చెబుతున్నారు. కానీ మాకు స్పష్టంగా తెలియడం లేదు.

జగన్: ఒకే కుటుంబం నుంచి ఇంత మంది ఎందుకు వెళ్లారు?
చిన్నమ్మడు: మా ఊళ్లో పూర్తిగా పనులు లేవు... ఉపాధి పనుల వలన కూడా పూట గడవని పరిస్థితి. పొట్టగడవడాని కోసం మా వాళ్లంతా కలిసి చెన్నై వెళ్లారు.

జగన్: గోడ కూలిన ఘటనలో ఆ కంపెనీపై కేసులేమైనా పెడ్తున్నారా... మా సాయం కావాలా?
మృతుని బావ యర్రయ్య: చెన్నైలో అధికారులు కొంత మంది మా వాళ్ల దగ్గరకు వచ్చి సంతకాలు తీసుకున్నారటన్నా... వాళ్లు మాకు విషయం చెప్పారు. ముందు మాకు సంబంధం లేదని కంపెనీ వాళ్లు బుకాయించారు.  

జగన్: చెన్నై నుంచి పరిహారం అందిందా?
చిన్నమ్మడు: పరిహారం బాండ్లు తయారయ్యాయని అధికారులు చెప్పారు... చిన్న పిల్లలు కావడంతో వారికి ఇవ్వలేదు... మరో రెండు రోజుల పోతే ఆంధ్రాబ్యాంక్‌లోని ఖాతాకు జమచేస్తామని చెప్పారు. తమిళనాడు గవర్నమెంట్ నుంచి కూడా మరో రెండు రోజుల్లో వస్తాయన్నారు.

జగన్: మీ ఊళ్లో ఎంత మంది చెన్నై వెళ్లారు... ఊళ్లో ఉపాధి పనులు లేవా?
మృతుల బావ ముసలయ్య: మా ఊరు నుంచి ఇంటికి ఒకరు చొప్పున చెన్నైలో ఉన్నారు. ఇక్కడ పనుల్లేవు బాబూ... అందుకే చెన్నై వెళ్లిపోయారు. చనిపోయిన వాళ్లంతా మొన్ననే ఊరోచ్చివెళ్లారు... ఊళ్లో పనులు ఉంటే వారు వెళ్లేవారు కాదు.

జగన్: పిల్లలు చదువుతున్నారా... ఎక్కడ చదువుతున్నారు?
మృతుల తండ్రి నర్సింహులు: సిమ్మయ్యకు ఒక్క కొడుకు సంతోషే మిగిలాడు... ఇక్కడే చదువుతున్నాడు... అప్పయ్య పిల్లలు ప్రసాద్, అశ్వినిలు వాళ్ల తాతగారి ఊరు జలుమూరులో చదువుతున్నారు.

జగన్: మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ పార్టీ ఇన్‌చార్జి శీను ఉంటాడు... రేపు మరళా మీ ఊరు వస్తాడు... ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం కోసం ఆయన మీకు సాయం చేస్తాడు... అంటూ జగన్ మృతుల పిల్లలు ప్రసాద్, అశ్విని, సంతోష్‌లను అప్యాయంగా ముద్దాడారు.

రిమ్స్‌క్యాంపస్: 
చెన్నైలో ఇటీవల జరిగిన రెండు ప్రమాదాల్లో మృతిచెందిన వారిని పరామర్శించేందుకు రెండోరోజు శుక్రవారం నరసన్నపేట మండలంలోని బాలసీమ, సారవకోట మండలంలోని సత్రాం, కోటబొమ్మాళి మండలంలోని పాకివలస, చుట్టిగుండం, భామిని మండలం కొరమ గ్రామాలకు వెళ్లిన రాజన్నబిడ్డ, వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు సాదరంగా ఆహ్వానించారు. కొన్ని చోట్ల తమ సమస్యలు చెప్పుకున్నారు.

జగనన్న వచ్చారు...పదండ్రో అంటూ సారువకోట మండలం అలుదు గ్రామం వద్దకు జగన్ కాన్వాయ్ రాగానే అక్కడి ప్రభుత్వ పాఠాశాల విద్యార్థులు రోడ్డుపైకి పరుగులు తీశారు. వారిని జగన్ ఆప్యాయంగా పలకరించారు. సారవకోట మండలం సత్రాం గ్రామానికి జగన్ వస్తున్నారని తెలుసుకుని బి.తవిటయ్య అనే వికలాంగుడు దేకురుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. తవిటయ్యను చూసిన జగన్ దగ్గరకు వెళ్లి కష్టసుఖాలను తెలుసుకున్నారు. బాబు ఎంత మోసం చేశాడో జగనన్నకు చెబుదామంటూ కోటబొమ్మాళి మండలం పాకివలస డ్వాక్రా మహిళలు పరుగున వచ్చారు.
 
మడపాం సమీపంలోని మహిళలు రోడ్డుపై నిరీక్షించడంతో జగన్ కాన్వాయ్‌ను ఆపి వారిని పలకరించారు. రుణాలు మాఫీ చేయకుండా సీఎం చంద్రబాబు తమను మోసం చేశారంటూ బైరి జంక్షన్ వద్ద పలువురు రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని జగన్‌కు విన్నవించారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలయ్యేలా చూడాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకులు చుట్టిగుండంలో జగన్‌ను కలసి వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా నుంచి తిరిగివెళ్తున్న జగనన్నకు ఆమదాలవలస వద్ద తమ్మినేని విద్యాసంస్థల విద్యార్థులు టాటా చెప్పారు.
Share this article :

0 comments: