
అసెంబ్లీలో శుక్రవారం అధికారపక్షం నేతలు 19సార్లు అన్ పార్లమెంటరీ భాష ఉపయోగిస్తే ఏమీ అనని స్పీకర్, తాము ఒక్కసారి 'బఫూన్' అనే పదం ఉపయోగిస్తే దానికి అభ్యంతరం చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. సభలో తమ గొంతు వినిపించే అవకాశం లేనందునే బయటకు వచ్చి తమ తెలుపుతున్నామన్నారు.
గత మూడు నెలల్లో వైఎస్ఆర్ సీపీకి చెందిన 14మంది చనిపోయారని, వాటిపై విచారణ చేపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. పరిటాల రవి హత్య కేసులో కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అసెంబ్లీలో చర్చ జరుపుతున్నారన్నారు. అవి తప్పుడు ఆరోపణలు అని చంద్రబాబుకు తెలుసు కాబట్టే ....జేసీ బ్రదర్స్ కు టికెట్లు ఇచ్చారన్నారు. 14 మంది రాజకీయ హత్యలకు గురైతే కనీసం వాళ్ల గురించి ఒక్క మాట మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం దారుణమని ఆయన చెప్పారు.
0 comments:
Post a Comment