రూ.5 లక్షల కోట్లు డిమాండ్ ఏమైంది? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రూ.5 లక్షల కోట్లు డిమాండ్ ఏమైంది?

రూ.5 లక్షల కోట్లు డిమాండ్ ఏమైంది?

Written By news on Saturday, August 16, 2014 | 8/16/2014

రూ.5 లక్షల కోట్లు డిమాండ్ ఏమైంది?వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధికారం ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు చేసిన తన తొలి సంతకం రుణమాఫీకి అసలు విలువ ఏమైనా ఉందా?అని ప్రశ్నించారు. శనివారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మాట్లాడిన అంబటి.. చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును తప్పుబట్టారు. ఆయన చేసిన ఐదు సంతకాల్లో ఇప్పటి వరకూ ఒక సంతకాన్ని అయినా అమలు చేయడంలో సఫలమైయ్యారని నిలదీశారు. రాజధానిపై కేంద్రం వేసిన కమిటీ నివేదిక ఇవ్వకుండానే గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని చేస్తామని ప్రకటన చేయడం వెనుక ఆంతర్య ఏమిటని అంబటి అడిగారు. చంద్రబాబు తనకు సంబంధించిన వ్యక్తుల భూముల రేట్లు పెంచడానికే అలాంటి ప్రకటనలు చేశారని ఎద్దేవా చేశారు.
 
రుణమాఫీపై కూడా బోగస్‌ ప్రకటనలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని అంబటి విమర్శించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత  ఏ రాష్ట్రంలో కూడా పోలీసు వ్యవస్థను ప్రతిపక్ష పార్టీపై దాడులు చేసే విధంగా వాడుకోలేదన్ని విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు సింగపూర్ వెళ్లి అక్కడి అధికార్ని కలిసినంత మాత్రానా రాష్ట్రం సింగపూర్ లా తయారవుతుందా?అని అంబటి ప్రశ్నించారు. రాజధాని నిర్మాణ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.5లక్షల కోట్లు తెస్తామన్న డిమాండ్ ఏమైందన్నారు. కనీసం రూ.2 లక్షల కోట్లు అయినా తెస్తారా?అని అంబటి బాబుకు సవాల్ విసిరారు.
Share this article :

0 comments: