హైదరాబాద్: నగరంలోని లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో 68వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం జాతీయ నేతల చిత్రపటాలతోపాటు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి నివాళుల్పించారు.
ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి 68వ స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
0 comments:
Post a Comment