వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుల నియామకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుల నియామకం

వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుల నియామకం

Written By news on Saturday, September 6, 2014 | 9/06/2014

హైదరాబాద్: పార్టీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన నూతన కమిటీలోని పీఏసీ సభ్యుల పేర్లను వైఎస్సార్ సీపీ ఖరారు చేసింది. రాజకీయ వ్యవహారాల మండలి (పీఏసీ)ని మరింత విస్తరించే క్రమంలో వైఎస్సార్ సీపీ మరో కొంతమందిని నూతన కమిటీలో సభ్యులుగా నియమించింది. 
 
పార్టీని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అనేక మార్పులు చేశారు. ఇప్పటికే పీఏసీలో పలువురు సభ్యులను నియమించిన పార్టీ..  వీరికి అదనంగా మరో కొంతమందిని ఎంపిక చేసింది. రాష్ట్ర వాలంటీర్స్‌ వింగ్‌ అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సరికొత్త బాధ్యతలు అప్పజెప్పగా, సెక్రటరీలుగా నిర్మలాకుమారి, అవ్వారు ముసలయ్య, గాంధీ, మేరుగ మురళీలను నియమించారు. ఈ రోజు ప్రకటించిన వైఎస్సార్ సీపీ నూతన కమిటీలోని సభ్యుల వివరాలు..


పీఏసీ సభ్యులు..సాగి దుర్గా ప్రసాదరాజు, సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారధి

జనరల్‌ సెక్రటరీలు.. కారుమూరి నాగేశ్వరరావు, తలశిల రఘురాం నియామకం

డాక్టర్స్‌వింగ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా దుట్టారామచంద్రరావు

వాలంటీర్స్‌ వింగ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

సెక్రటరీలుగా నిర్మలాకుమారి, అవ్వారు ముసలయ్య, గాంధీ, మేరుగ మురళీ

సీజీ సీ సభ్యులు.. గురునాథరెడ్డి, రెహమాన్‌, జక్కంపూడి విజయలక్ష్మి
పార్లమెంట్‌ అబ్జర్వర్స్‌..కొత్త కోట ప్రకాశ్‌ రెడ్డి, సురేశ్‌ బాబు
Share this article :

0 comments: