Home »
» ‘దేశం’ అరాచకాలపై పోరాటం: జగన్
‘దేశం’ అరాచకాలపై పోరాటం: జగన్
సాక్షి, కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులను అన్యాయంగా ఇబ్బంది పెడితే ఊరుకోబోమని, అసెంబ్లీలోనూ నిలదీస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా మంగళవారం పులివెందులకు వచ్చిన ప్రతి పక్షనేత జగన్ను గుంటూరు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం చెర్లోపల్లె, పెనుగొండ, చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గాలకు చెందిన మహిళలు కలిశారు. జగన్ చేతులు పట్టుకొని బోరున విలపించారు. ఏమీ చేయకపోయినా అధికార పార్టీ నేతలు తమను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. అదును చూసి అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పారు. ఎవరూ భయాందోళనలకు గురి కావాల్సిన అవసరంలేదని.. పార్టీ నిత్యం అండగా ఉంటుందని చెప్పారు. త్వరలోనే జిల్లాల వారీ సమీక్షలకు వస్తానని, అప్పుడు ఇలాంటి సమస్యలను ప్రస్తావించడంతోపాటు సంబంధిత అధికారులతో కూడా మాట్లాడతానన్నారు.
0 comments:
Post a Comment