టీడీపీ కార్యకర్తలకు మాత్రమే పింఛన్లా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ కార్యకర్తలకు మాత్రమే పింఛన్లా?

టీడీపీ కార్యకర్తలకు మాత్రమే పింఛన్లా?

Written By news on Monday, September 22, 2014 | 9/22/2014

అనంతపురం:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ వారికి మాత్రమే పింఛన్లు వచ్చేలా చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఆరోపించింది. దీనికి సంబంధించి సోమవారం జిల్లా కలెక్టర్ ను వైఎస్సార్ సీపీ నేతలు విశ్వేశ్వర రెడ్డి, వెంకట్రామి రెడ్డి, శంకర్ నారాయణ తదితరులు కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వృద్ధులు, వికలాంగులకు  పార్టీలకు అతీతంగా పింఛన్లు ఇచ్చారని ఈ సందర్భంగా కలెక్టర్ కు స్పష్టం చేశారు. కాగా, చంద్రబాబు మాత్రం టీడీపీ కార్యకర్తలకు మాత్రమే పింఛన్లు వచ్చేలా చూస్తున్నారన్నారు.
 
ఒకవేళ పింఛన్ల తొలగింపులో ఇబ్బందులుంటే ఆ జాబితాను బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్థానికంగా ఉన్న వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
Share this article :

0 comments: