వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై దాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై దాడి

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై దాడి

Written By news on Saturday, October 11, 2014 | 10/11/2014

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై దాడి
ముదిగుబ్బ : మలకవేముల గ్రామంలో అధికారుల సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై టీడీపీ నాయకులు దాడిచేశారు. బాధిత దంపతుల కథనం మేరకు... శుక్రవారం మలకవేముల గ్రామంలో ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీటీసీ ఎన్నికల్లో ఓట్లు వేయలేదన్న అక్కసుతో తమ పింఛన్లు రద్దు చేయించారని టీడీపీ నేత దేవేంద్రరెడ్డిపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను ఉసిగొలిపి తిట్టిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన పద్మావతి, యోగీశ్వర్‌రెడ్డి దంపతులపై దేవేంద్రరెడ్డి తన సమీప బంధువు భాస్కర్‌రెడ్డితో కలిసి అధికారుల సమక్షంలోనే దాడిచేశాడు. గాయపడిన పద్మావతి కదిరి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది.  
Share this article :

0 comments: