రోశమ్మ పింఛనూ తీసేశారు..! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రోశమ్మ పింఛనూ తీసేశారు..!

రోశమ్మ పింఛనూ తీసేశారు..!

Written By news on Thursday, October 9, 2014 | 10/09/2014

రోశమ్మ పింఛనూ తీసేశారు..!వీడియోకి క్లిక్ చేయండి
లేని భూమిని ఆమె పేరిట ఉన్నట్టుగా చెప్పిన అధికారులు 
ఐదెకరాలు దాటిందంటూ వృద్ధాప్య, వితంతు పింఛన్ నిలిపివేత
 
గడచిన నెల రోజుల్లో రాష్ట్రంలో 9.16 లక్షల పింఛన్లకు కత్తెర
రకరకాల కారణాలతో అనర్హులుగా వేటు వేసిన ప్రభుత్వం
ఆ కారణాలు తప్పంటూ జన్మభూమి సభల్లో నిలదీస్తున్న జనం
ఎక్కడికక్కడ నిలదీస్తుండటంతో తలపట్టుకుంటున్న అధికారులు
అనర్హుల జాబితాపై పునఃపరిశీలనకు సర్కారు ఆదేశాలు

 
 సాక్షి, హైదరాబాద్, కలిగిరి (నెల్లూరు):
రోశమ్మ ఎవరో తెలుసా? బహుశా! దూ బగుంట రోశమ్మంటే తెలుస్తుందేమో!? ఎందుకంటే సారా వ్యతిరేక ఉద్యోమానికి అంకురార్పణ జరిగింది దూబగుంటలోనే. మొదలెట్టింది రోశమ్మే. ప్రస్తుతం 80 ఏళ్లు నిండిన రోశమ్మకు ఎన్టీయార్ సీఎంగా ఉన్నప్పుడు పింఛను మం జూరైంది. ఇన్నాళ్లూ నిరాటంకంగా వచ్చింది. కానీ ఇపుడు నిలిచిపోయింది. కారణం... ఆమెకు ఐదెకరాల కన్నా ఎక్కువ భూమి ఉందట!! తనకు ఐదెకరాలు లేనేలేదని, ఉంటే అదెక్కడుందో చూపిస్తే చాలు పెన్షన్ ఇవ్వకపోయినా పర్వాలేదని రోశమ్మ మొత్తుకుంటున్నా వినేవారు లేరు. అదే విషయం స్థానిక ఎంపీడీవోనడిగితే... దానిపై విచారణ జరిపాక తేలుస్తామన్నారు.


శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తూర్పు దూబగుంటలో బుధవారం జరిగిన జన్మభూమి లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ప్రకటిం చిన పింఛనర్ల జాబితాలో 80 ఏళ్లు నిండిన వితంతువు రోశమ్మ పేరు విత్‌హెల్డ్‌లో ఉంచారు. ‘‘నాకు 3.60 ఎకరాల మెట్ట, 45 సెంట్ల మాగాణి ఉంది. ఐదెకరాలకు పైగా భూమి ఉందని అధి కారులు పింఛన్ ఆపేశారు. గతంలో వృద్ధాప్య పింఛన్ వచ్చేది. ఇప్పుడు వితంతు పింఛన్‌కూ నేను అర్హురాలినే. కిడ్నీలు పాడయి, నడవలేని స్థితిలో ఉన్న నాకు... పెన్షన్ ఎపుడిస్తారో తెలియటం లేదు’’ అనేది రోశమ్మ ఆవేదన.

ఇదొక్క రోశమ్మ వ్యవహారమే కాదు. విజ యనగరం జిల్లా సాలూరు మండలం ఖరాసు వలస గ్రామ సభలో కళ్లెదుట కనిపిస్తున్న వృద్ధురాలు చిన్నమ్మిని ఏకంగా నువ్వు మహిళవే కాదంటూ వెనక్కి పంపేశారు. గుంటూరు జిల్లా లో సొంతిల్లు కూడా లేక పూరింట్లో అద్దెకుం టున్న షేక్ గాలిబ్ సాహెబ్‌కు నీకు ఐదెకరాల కన్నా ఎక్కువ భూమి ఉంది కనక పింఛను రాదు పొమ్మన్నారు. అదే జిల్లాలో పండు ముసలి షేక్ మౌలాబీని నీ వయసు 55 ఏళ్లే కనక అనర్హురాలివన్నారు. ఇవన్నీ జరగటానికి కారణం ఒక్కటే! పింఛన్ల భారాన్ని తగ్గించుకోవటానికి, బడ్జెట్లో కేటాయించిన అరకొర మొత్తాన్నే పింఛను దార్లందరికీ సర్దడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. వీలైనన్ని పింఛన్లకు కోత పెడుతోంది. ప్రభుత్వం పెట్టిన కొత్త నిబంధనలు, తనిఖీల కారణంగా గడిచిన 15 రోజుల్లో దాదాపు 9.16 లక్షల మంది పెన్షనర్లు అనర్హులైపోయారు. ఎందుకంటే గత నెలలో రాష్ట్రంలో దాదాపు 43.12 లక్షల మంది పింఛను తీసుకోగా ఈ నెలలో 33.96 లక్షల మందికే ప్రభుత్వం పింఛను మంజూరు చేసింది. అన్ని ధ్రువపత్రా లూ ఇచ్చామని, వేలి ముద్రలు కూడా తీసుకున్నారని, అయినా గ్రామ సభల్లో అందరి ఎదుటా ఇచ్చే పింఛన్లలో అనర్హులు ఎందుకుంటారని లబ్ధిదారులు అడుగుతున్నా వినేవారు లేరు. కొందరి వయసు తగ్గించి, మరికొందరికి భూమి ఉందని చెప్పి... ఇలా రకరకాల కారణాలతో కోతలు వేసేస్తున్నారు. వీటిపై గ్రామ స్థాయిలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమాల్లో పింఛనుదారుల ప్రశ్నలకు జవాబు చెప్పలేక అధికారులు సతమతమవుతున్నారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో ఐదెకరాల భూమి ఉందంటూ తొలగించినడంతో ఆగ్రహించిన పిం ఛనుదారు ‘‘నాకు పింఛనొద్దు. ఆ భూమి ఎక్క డుందో చూపించండి చాలు’’ అని అధికారుల్ని నిలదీశారు. ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.

దిద్దుబాటులో ప్రభుత్వం

పింఛన్ల కత్తిరింపుపై నిరసనలు వెల్లువెత్తడంతో అధికారులు అప్రమత్తమయింది. తొలగించిన 9,16,310 పింఛను దార్లలో 3,34,569 మందిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, మున్సిపల్ వార్డు కమిటీలు అనర్హులుగా నిర్ధారించాయి. ఈ కమిటీలు అర్హులుగా పేర్కొన్నప్పటికీ 4.70 లక్ష లమందిని ప్రభుత్వమే అనర్హులంటూ కోతపెట్టింది. మరో 1.11 ల క్షల మంది గ్రామ సభలకు అందుబాటులో లేకపోవటంతో వారూ అనర్హులయ్యారు. ప్రభుత్వం తొలగించిన 4.70 లక్షల మందిలో 90శాతం మంది అర్హులేనని పునః పరి శీలనలో తేలటంతో మొత్తం అనర్హుల జాబితాను మరోసారి పరిశీలించాలని జిల్లా అధికారులకు సూచించినట్లు తెలిసింది. కాగా పింఛను, రేషన్ కార్డు, ఆధార్‌లను అనుసంధానం చేయటంతో వాటిలోని తప్పుల వల్లే భారీ సంఖ్యలో అనర్హులు తేలినట్లు అధికారులు చెబుతున్నారు.  
 
జన్మభూమి సభల్లోనే పింఛన్ల పంపిణీ

పదేళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పింఛన్ల పంపిణీ జరిగే పద్ధతి ఇపుడు పునరావృత్తమైంది. పదేళ్లుగా ప్రతి నెలా 1వ తేదీ నుంచి 5లోగా గ్రామ, మున్సిపల్ వార్డులో పింఛన్ల పం పిణీ పూర్తయ్యేది. 15వ తేదీ కల్లా జిల్లాలో పంపీ ణీ చేసిన మొత్తం పింఛన్ల వివరాలు జిల్లా అధికారులకు చేరేవి. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ కాలంలో నెలవారీ పింఛన్ల పంపిణీ బదులు జన్మభూమి కార్యక్రమం సందర్భంగా మూడు నుంచి ఆరు నెలల పింఛన్ల డబ్బు ఒకేసారి ఇచ్చేవారు. ఈ ఏడాది అక్టోబరు నెల పింఛన్‌ను కూడా జన్మభూమి సభల్లోనే పంపిణీ చేస్తున్నారు.
 
 
 ‘‘నాకు 3.60 ఎకరాల మెట్ట, 45 సెంట్ల మాగాణి ఉంది. మొత్తం 4.05 ఎకరాలు. కానీ పెన్షన్ ఎందుకు ఆపేశారని అడిగినపుడు ఐదెకరాలకు పైగా భూమి ఉండటం వల్లనని అధికారులు చెప్పారు. ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి వృద్ధాప్య పింఛన్ వస్తోంది. ఇప్పుడు వితంతు పింఛన్‌కూ నేను అర్హురాలినే. కిడ్నీలు పాడయి, నడవలేని స్థితిలో ఉన్న నాకు... పెన్షన్ ఎపుడిస్తారో తెలియటం లేదు’’  - రోశమ్మhttp://img.sakshi.net/images/cms/2014-10/51412800663_Unknown.jpg
 
కేటాయింపులనాడే తేలిన కోతలు

ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ కొన్ని అంశాలు మీడియా దృష్టికి తెచ్చారు. ‘‘గ్రామీణాభివృద్ధి శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రం లో 43.11 లక్షల మంది పెన్షనర్లున్నారు. వీరికి నెలకు చెల్లిస్తున్నది రూ.130 కోట్లు. అక్టోబరు 1నుంచి కనీస పింఛను రూ.1000 చేస్తున్నారు కాబట్టి అప్పటిదాకా ఐదు నెలల పాటు అంటే నెలకు రూ.130 కోట్ల చొప్పున రూ.650 కోట్లవుతాయి. పెండింగ్‌లో ఉన్న 15 లక్షల కొత్త పింఛను దరఖాస్తుల్ని లెక్కలోకి తీసుకోకుండానే ఇవే 43.11 లక్షల పిం ఛన్లకు నెలకు రూ.1000 చొప్పున లెక్కిస్తే కావాల్సింది 431 కోట్లు. రూ.1500 చెల్లించాల్సిన వికలాంగ పెన్షనర్లను పరిగణనలోకి తీసుకుంటే మరో 10 కోట్లు కావాలి. మొత్తం మీద నెలకు కావాల్సింది రూ.440 కోట్లు. 7 నెలలకు రూ.3080 కోట్లవుతాయి. దీనికి 650 కోట్లు కలిపితే బడ్జెట్లో కేటాయించాల్సింది రూ.3730 కోట్లు. కేటాయించింది 1338 కోట్లు. దీనర్థం ఉన్న పింఛన్లను ఊడబెరుకుతామనే కదా?’’ అంటూ ప్రభుత్వం వేయబోతున్న కత్తిరింపుల్ని ముందే మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుత కోతలు అదే తీరులో ఉండటం ప్రస్తావనార్హం.
 జగన్
Share this article :

0 comments: