వైఎస్ఆర్ ఫౌండేషన్- 'సాక్షి' మీడియా గ్రూపు సంయుక్తంగా పిలుపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ ఫౌండేషన్- 'సాక్షి' మీడియా గ్రూపు సంయుక్తంగా పిలుపు

వైఎస్ఆర్ ఫౌండేషన్- 'సాక్షి' మీడియా గ్రూపు సంయుక్తంగా పిలుపు

Written By news on Wednesday, October 15, 2014 | 10/15/2014

వైఎస్ జగన్ రూ. 50 లక్షల విరాళం
హైదరాబాద్: హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనవంతుగా రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు.  వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ సాయాన్ని బాధితులను ఆదుకునేందుకు వినియోగించనున్నారు. తుపాను కారణంగా సర్వం కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు ముందుకు రావాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఆయన పర్యటిస్తున్నారు.

కాగా, తుపాన్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని వైఎస్ఆర్ ఫౌండేషన్- 'సాక్షి' మీడియా గ్రూపు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. సహాయం చేయదలిచిన వారికోసం బ్యాంకు ఖాతా ప్రారంభించినట్టు వెల్లడించాయి.  సహాయం చేయదలిచిన వారు డిడిలు, చెక్కులు ఇందులో జమ చేయొచ్చని తెలిపాయి. సాక్షి' కార్యాలయాల్లోనూ నేరుగా డిడిలు, చెక్కులు అందజేయవచ్చు.

అకౌంట్ పేరు: వైఎస్ఆర్ ఫౌండేషన్
అకౌంట్ నంబర్: 31868397566
బ్యాంకు పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఐఎఫ్ఎస్ సీ కోడ్: ఎస్ బీఐఎన్ 0008022
బ్రాంచి: బంజారాహిల్స్, హైదరాబాద్
బ్రాంచి కోడ్: 08022
Share this article :

0 comments: