హుదూద్ తుపాన్ బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆయన శుక్రవారం నగరంలోని సాకేత పురం, స్టీల్ప్లాంట్, బర్మా కాలనీ, అశోక్నగర్, దయాళ్నగర్, హై స్కూల్ రోడ్, గాజువాక ఏరియాల్లో పర్యటించనున్నారు. బాధితులను పరామర్శించడంతో పాటు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(కార్యక్రమాలు) తలశిల రఘురాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment