నవంబర్ 5న అన్ని మండల కార్యాలయాల్లో వైఎస్సార్ సీపీ ధర్నా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నవంబర్ 5న అన్ని మండల కార్యాలయాల్లో వైఎస్సార్ సీపీ ధర్నా

నవంబర్ 5న అన్ని మండల కార్యాలయాల్లో వైఎస్సార్ సీపీ ధర్నా

Written By news on Monday, November 3, 2014 | 11/03/2014


'వైఎస్సార్ సీపీ ధర్నాను విజయవంతం చేయండి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ప్రజలను నిలువునా వంచిస్తున్నారని ఆమె విమర్శించారు. ఆయన మాటలను నమ్మి మోసపోయిన సంగతిని ప్రజలందరూ గుర్తించారని పద్మ తెలిపారు.  ఇప్పటివరకూ ఒక పైసా రుణమాఫీ చేయకుండా ప్రజలను మోసగిస్తున్నారన్నారు.
 
చంద్రబాబు మోసాలకు వ్యతిరేకంగా నవంబర్ 5న అన్ని మండల కార్యాలయాల్లో వైఎస్సార్ సీపీ ధర్నా చేపడుతుందన్నారు. వైఎస్సార్ సీపీ చేపట్టే ధర్నాను విజయవంతం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ధర్నాలో పాల్గొనేందుకు రైతులు, డ్వాక్రా మహిళలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని పద్మ తెలిపారు.

Share this article :

0 comments: