skip to main |
skip to sidebar
Home »
» ప్రజల పక్షాన పోరాటం
ప్రజల పక్షాన పోరాటం
సాక్షి, ఖమ్మం: బడుగు, బలహీన వర్గాలు, రైతులు, ప్రజల పక్షాన అసెంబ్లీలో వైఎస్సార్సీపీ గళం విప్పుతుందని పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శిం చారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోయి అప్పుల పాలైన రైతులు ఇప్పటికే 230 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవే శపెట్టిన సంక్షేమ పథకాల కొనసాగింపుపై వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షనేత, అశ్వారావుపేట ఎమ్మె ల్యే తాటి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజీవ్సాగర్ ప్రాజెక్టు, గిరిజన వర్సిటీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం తదితర అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు.
0 comments:
Post a Comment