హైదరాబాద్ : జనవరి 6, 7 తేదీల్లో తాను స్వయంగా నిరాహార దీక్ష చేస్తానని, ఇది గోదావరి జిల్లాల్లో జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం నాడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు. ఈనెల 5వ తేదీన మండల కేంద్రాల్లో దీక్షలు ఉంటాయని, డిసెంబర్ 5న కలెక్టరేట్ ఎదుట మరో దీక్ష ఉంటుందని ఆయన చెప్పారు. ఇలా.. చంద్రబాబును నిలదీసే కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా గట్టిగా చేపడతామన్నారు.
నవంబర్ 5న మొత్తం 663 మండలాల కేంద్రాల్లో ధర్నా చేయబోతున్నామని వైఎస్ జగన్ చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. మొన్న చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలను పట్టించుకోని పరిస్థితుల్లో.. అక్కడి ప్రజల డిమాండ్లన్నీ కలిపి మొత్తం అన్ని డిమాండ్లతో ధర్నా చేయబోతున్నామని, దీన్ని విజయవంతం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరినీ, అక్క చెల్లెళ్లను పేరుపేరునా కోరుతున్నానని ఆయన తెలిపారు.
0 comments:
Post a Comment