- 661 మండల కేంద్రాల్లో కదం తొక్కిన పార్టీ శ్రేణులు
- తహశీల్దార్ కార్యాలయాల ముట్టడి, ధర్నాలు
- భారీ ర్యాలీలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు
- దద్దరిల్లిన మండల కేంద్రాలు, తహశీల్దార్లకు వినతిపత్రాలు
- స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు ప్రకటించిన ప్రజలు
- ముందుండి నడిపిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు

ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలతో మండల కేంద్రాలన్నీ దద్దరిల్లాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులను దిగ్బంధించారు. పలు జిల్లాల్లో బైకు ర్యాలీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో సోంపేటలో మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ను అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో తహశీల్దార్ కార్యాల యానికి తాళాలు వేసి పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. చంద్రబాబు ఎన్నికల హామీలను అమలు చేయూలని డిమాండ్ చేస్తూ అన్ని మండల కేంద్రాల్లో తహశీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. అనంతపురం జిల్లా పాదయాత్రలో రైతు రుణాలను మాఫీ చేస్తానని బాబు ప్రకటించారని, ఇప్పుడు షరతులు విధిస్తున్నారని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు గురునాథరెడ్డి దుయ్యబట్టారు.
ఇది ఆరంభం మాత్రమేనని, చంద్రబాబు సర్కారు గద్దెదిగే దాకా ఉద్యమిస్తామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. మాట తప్పిన బాబును ప్రశ్నించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో కొనసాగడం కష్టమేనని, ఆయన ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కేసులు, రౌడీషీట్లకు భయపడి ఇళ్లలో కూర్చోమని, వైఎస్సార్ రాజకీయ వారసులుగా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం సాగిస్తామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి తిరుపతిలో చెప్పారు.
కొత్త రుణాలు లభించక పొదుపు మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆవేదన వ్యక్తంచేశారు.ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిందేనని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం విస్మరించి మోసగించాలని చూస్తే సహించేది లేదని, తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.

రాష్ట్రంలోని ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని శాసనసభలో ఆ పార్టీ డెప్యూటీ ఫ్లోర్లీడర్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) స్పష్టం చేశారు. చంద్రబాబు సర్కారు మెడలు వంచైనా రుణమాఫీ అమలు చేయించే వరకు తమ పార్టీ నిద్రపోదని జగ్గంపేటలో అసెంబ్లీలో శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ చెప్పారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంతవరకు పోరాటం చేస్తామని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యేల ఆర్వీ సుజయ్కృష్ణ రంగారావు తెలిపారు.
అన్ని జిల్లాల్లోనూ అదే హోరు...
ఎన్నికల హామీ మేరకు రైతు, డ్వాక్రా, చేనేత రుణాలను తక్షణం మాఫీ చేయూలనే డిమాండ్తో వైఎస్సార్సీపీ నిర్వహించిన ఆందోళనలు అన్ని జిల్లాల్లోనూ విజయవంతమయ్యాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కన్వీనర్లు, నేతలు, పార్టీ శ్రేణులతో పాటు రైతులు, డ్వాకా మహిళలు భారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మండల కార్యాలయాలను ముట్టడించడంతో పాటు వాటి ఎదుట ధర్నాకు దిగారు.అన్ని మండలాల్లోనూ సంబంధిత అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి ప్రభుత్వం దృష్టికి సమస్యను తేవాలని కోరారు.
0 comments:
Post a Comment