'తుపాను నిధుల్లో సగం బాబు జేబులోకే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'తుపాను నిధుల్లో సగం బాబు జేబులోకే!

'తుపాను నిధుల్లో సగం బాబు జేబులోకే!

Written By news on Saturday, November 29, 2014 | 11/29/2014


'తుపాను నిధుల్లో సగం బాబు జేబులోకే!'
విశాఖపట్నం : హుదూద్ తుపాను సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 460 కోట్లు విడుదలైతే.. అందులో అధికభాగం చంద్రబాబు జేబులోకే వెళ్లాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా తుపాను బాధితుల కోసం వచ్చిన విరాళాల వివరాలను స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతం వల్లించి రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారన్నారు. టీడీపీలా ధనబలంతో కాకుండా.. ప్రజాబలంతో 2019 ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

క్షేత్రస్థాయిలో కమిటీలను నియమించి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుస్తామన్నారు. విశాఖపట్నం నగరానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎనలేని సేవలందించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి ఏమీ చేయని చంద్రబాబు మాత్రం విశాఖకు అతా తానే చేసినట్లు చెప్పుకొంటున్నారన్నారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కంపెనీలను నష్టాల్లోకి నెట్టి, ప్రైవేటీకరణకుపూనుకున్నారని, ఐటీ, ఫార్మా, సినీ పరిశ్రమల అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని విశాఖలో ఏర్పాటుచేశామని ఆయన తెలిపారు. చంద్రబాబు పాలనలో నష్టాల్లోఉ న్న ప్రభుత్వరంగ సంస్థలను వైఎస్ఆర్ పాలనలో అభివృద్ధిలోకితెచ్చారని, పార్టీ కోసం ప్రతి ఒక్కరూ సేవ చేస్తే వారి సేవలను పార్టీ గుర్తిస్తుందని ఆయన చెప్పారు
Share this article :

0 comments: