పింఛన్లు కోల్పోయిన వారికోసం పోరాడుదాం: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పింఛన్లు కోల్పోయిన వారికోసం పోరాడుదాం: వైఎస్ జగన్

పింఛన్లు కోల్పోయిన వారికోసం పోరాడుదాం: వైఎస్ జగన్

Written By news on Monday, November 24, 2014 | 11/24/2014


పింఛన్లు కోల్పోయిన వారికోసం పోరాడుదాం: వైఎస్ జగన్
ఒంగోలు : పింఛన్లు కోల్పోయిన వారికోసం పోరాటం చేద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం ప్రకాశం జిల్లా పార్టీ సమీక్ష సమావేశాల్లో భాగంగా ఒంగోలులో మాట్లాడారు. అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై వైఎస్ జగన్ సమీక్షించారు.

గత 7 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3700 కోట్ల రూపాయలను పింఛన్ల కోసం ఖర్చు చేయాల్సివుండగా, కేవలం 1338 కోట్లు మాత్రమే కేటాయించిందని వైఎస్ జగన్ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లను పెంచామని చెప్పుకుంటూ, మరోవైపు లక్షల సంఖ్యలో కోత వేశారని విమర్శించారు.


ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి...టీడీపీకి ఓట్ల తేడా అయిదు లక్షలేనని  వైఎస్ జగన్ అన్నారు. ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు ఎన్నో అబద్ధాలు చెప్పారని అన్నారు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పిఉంటే వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చేందన్నారు.  చంద్రబాబుకు లేనిదీ...మనకు ఉన్నది ...దేవుడి దయ అని వైఎస్ జగన్ అన్నారు. 
Share this article :

0 comments: