ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రాల్లో నిర్వహించిన ధర్నాలు విజయవంతం అయ్యాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ఆందోళన కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులతో పాటు రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
హామీల అమలుపై మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. రుణమాఫీపై రోజుకో మాట చెబుతున్న టీడీపీ సర్కారుపై ఆందోళనకారులు మండిపడ్డారు. ఫించన్ల కోతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హుద్హుద్ తుపాను బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ధర్నాల్లో పాల్గొన్నవారందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలిపింది. వచ్చే నెల 5వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
హామీల అమలుపై మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. రుణమాఫీపై రోజుకో మాట చెబుతున్న టీడీపీ సర్కారుపై ఆందోళనకారులు మండిపడ్డారు. ఫించన్ల కోతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హుద్హుద్ తుపాను బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ధర్నాల్లో పాల్గొన్నవారందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలిపింది. వచ్చే నెల 5వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
0 comments:
Post a Comment