పార్టీపరంగా ఏర్పాటు చేసిన జగన్
ఏపీ రాజధాని నిర్మాణం పేరిట అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆగడాలను, బెదిరింపు రాజకీయాలను, రైతులకు అన్యాయం చేసే కార్యక్రమాలను, భూ దందాలను ఎదుర్కొనడంతో పాటుగా రైతుల పక్షాన నిలిచేందుకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ పరంగా రాజధాని రైతు హక్కుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఎనిమిది మందితో కూడిన ఈ కమిటీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, కె.పార్థసారథి, అంబటి రాంబాబు, కొడాలి నాని, మర్రి రాజశేఖర్, గొట్టిపాటి రవికుమార్, ఆళ్ల రామకృష్ణారెడ్డి సభ్యులుగా ఉంటారు. త్వరలో ఈ కమిటీ ఆయా ప్రాంతాల్లో పర్యటించనుందని పార్టీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఏపీ రాజధాని నిర్మాణం పేరిట అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆగడాలను, బెదిరింపు రాజకీయాలను, రైతులకు అన్యాయం చేసే కార్యక్రమాలను, భూ దందాలను ఎదుర్కొనడంతో పాటుగా రైతుల పక్షాన నిలిచేందుకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ పరంగా రాజధాని రైతు హక్కుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఎనిమిది మందితో కూడిన ఈ కమిటీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, కె.పార్థసారథి, అంబటి రాంబాబు, కొడాలి నాని, మర్రి రాజశేఖర్, గొట్టిపాటి రవికుమార్, ఆళ్ల రామకృష్ణారెడ్డి సభ్యులుగా ఉంటారు. త్వరలో ఈ కమిటీ ఆయా ప్రాంతాల్లో పర్యటించనుందని పార్టీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
0 comments:
Post a Comment