దాడులు చేసి...మళ్లీ ఎదురు కేసులా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దాడులు చేసి...మళ్లీ ఎదురు కేసులా?

దాడులు చేసి...మళ్లీ ఎదురు కేసులా?

Written By news on Wednesday, November 12, 2014 | 11/12/2014


హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరగటం పరిపాటిగా మారిందని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల దాడిలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైెఎస్ఆర్ సీపీ పార్టీ కార్యకర్త పుట్టా దస్తగిరి రెడ్డిని ఆయన బుధవారం పరామర్శించారు.
 
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ దాడులపై ఎన్నిసార్లు ప్రశ్నించినా..ఎంత ఒత్తిడి చేసినా స్పందన శూన్యమని అన్నారు.  జరుగుతున్న అరాచకాలపై కేసులు పెడతామన్నా...తీసుకునే  పరిస్థితి లేదని ఆయన అన్నారు. అధికార పక్షం నేతలే దాడులు చేసి వాళ్లే ఎదురు కేసులు పెడుతున్నారని... ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత మైసూరారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ పాలనలో రాజ్యాంగేతర శక్తుల జోక్యం ఎక్కువైందని, దాడులు చేసిన ముద్దాయిలే... మళ్లీ కేసులు పెట్టడం ఎంత వరకూ సమంజసమని మైసూరారెడ్డి ప్రశ్నించారు.
Share this article :

0 comments: